నందమూరి బాలకృష్ణ తన కెరీర్లో మాస్ ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తాడో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇప్పటిదాకా ఆయన నటించిన సినిమాలన్నీ కూడా మాస్ ప్రేక్షకులను టార్గెట్గా చేస్తూ వచ్చిన సినిమాలే. ఆ విధంగా ఇప్పుడు ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. మాస్ పరీక్షకులను టార్గెట్ గా చేస్తూ వచ్చిన ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.  వీరసింహారెడ్డి అనే మాస్ టైటిల్ తో రాబోతున్న నందమూరి బాలకృష్ణ ఆ తర్వాత కూడా మాస్ దర్శకులతో సినిమాలు చేసే విధంగా రంగం సిద్ధం చేసుకున్నాడు.

అలా మాస్ చిత్రాలను ఎంటర్టైన్మెంట్ గా చేయడంలో మంచి పేరున్న దర్శకుడైన అనిల్ రావిపూడి తో కలిసి ఆయన తన తదుపరి సినిమాను చేయబోతున్నాడు. వచ్చే ఏడాది ఈ సినిమాను మొదలు పెట్టాలని నందమూరి బాలకృష్ణ భావిస్తున్నాడు. తొందరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రాబోతుంది. ఈ నేపథ్యంలో ఆ తర్వాత ఆయన సినిమాలు చేసే దర్శకుల జాబితా చాలా పెద్దదిగానే ఉందని చెప్పాలి. అందులో భాగంగానే అల్లు శిరీష్ తో కలిసి ఈ హీరో ఒక సినిమా చేయబోతున్నాడు అనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. దీనికి పరశురామ్ దర్శకత్వం వహిస్తాడని అంటున్నారు. 

అయితే గతంలో నందమూరి బాలకృష్ణ ఓ చిన్న హీరోతో సినిమా చేయగా అది బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో ఫ్లాప్ అయ్యింది. ఆయనకు బాడ్ ఇమేజ్ ని కూడా తెచ్చి పెట్టింది. మంచు మనోజ్తో కలిసి ఇవ్వు కొడతారా ఉలిక్కిపడతారా అనే సినిమాను చేసిన నందమూరి బాలకృష్ణ ఆ చిత్రం ఎందుకు చేశాడు అన్న విమర్శలను ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యంలోనే అలాంటి పొరపాటు చేసి తన క్రేజ్ ను తగ్గించుకోకుండా మంచి దర్శకులతో మంచి కథలు ఉన్న సినిమాలను చేయాలి అని ఆయన అభిమానులు బాలకృష్ణకు సలహాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అనిల్ రావిపూడి తర్వాత ఏ దర్శకుడు తో సినిమా చేస్తాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: