
టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. దాదాపుగా టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ అనుకోకుండా బాలీవుడ్ లోకి అడుగుపెట్టి ఆ తర్వాత తెలుగులో ఏ ఒక్క చిత్రంలో కూడా నటించలేదు. ఇక తాజాగా న్యూ ఇయర్ పార్టీని చేసుకుని చాలా అలసిపోయినట్టుగా ఉన్నది. బీచ్ ఒడ్డున రిలాక్స్ అవుతూ కొన్ని ఫోటోలను షేర్ చేయగా అందులో తన అందాల ఆరబోత కుర్రకారులను చెమటలు పట్టించేలా చేస్తోంది.

టాప్ టు బాటమ్ అందాలను చూపిస్తూ రకుల్ ప్రీతిసింగ్ ఈ ఫోటోలను షేర్ చేసింది. రకుల్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ అందాలు కూడా పెంచుతోంది అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. గత సంవత్సరం బాలీవుడ్ లో ఎన్నో సినిమాలు విడుదలైనప్పటికీ ఈమెకు ఏ సినిమా కూడా అంతగా కలిసి రాలేదని చెప్పవచ్చు. బాలీవుడ్ లో ఏడాదంతా సందడి చేసిన బ్యూటీగా పేరుపొందింది. బాలీవుడ్ ఆఫర్లు చాలా వస్తుండడంతో టాలీవుడ్ ను లైట్గా తీసుకుంది ఈ ముద్దుగుమ్మ. దీంతో ఇక్కడ పెద్దగా ఆఫర్లు రాలేకపోయింది చివరిగా వైష్ణవి తేజ్ తో కలిసి కొండ పొలం సినిమాలో డి గ్లామరస్ హీరోయిన్గా నటించింది.
