సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే తెలియని వారంటూ ఎవరు ఉండరు. కృష్ణ వారసుడిగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు మహేష్ బాబు. ఎన్నో కమర్షియల్ చిత్రాలలో నటించిన ఈయన ఈ మధ్యకాలంలో చేస్తున్న అన్ని సినిమాలలో కూడా ఏదో ఒక సందేశం ఉండేలా చూసుకుంటున్నారు. శ్రీమంతుడు సినిమా మొదలు బ్రహ్మోత్సవం, మహర్షి, సర్కారు వారి పాట చిత్రాలలో కూడా పలు సందేశాలు ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. ఇవన్నీ కమర్షియల్ చిత్రాలైనప్పటికీ ఏదో ఒక సందేశాన్ని ప్రేక్షకులకు ఇచ్చేలా ప్లాన్ చేశారు ప్రస్తుతం మహేష్ బాబు తన 28వ చిత్రాన్ని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్నారు.


ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్డే, శ్రీ లీల నటిస్తున్నారు. ఈ సినిమాని ఒక రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ జోనర్లో తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. త్రివిక్రమ్ గత సినిమాల గనుక చూస్తే ఆయన కూడా ప్రతి సినిమాతో ఏదో ఒక సందేశాన్ని ప్రేయర్ చేయకులకు పంచే ప్రయత్నం చేశారు. కాబట్టి ఈ సినిమాతో కూడా మహేష్ బాబు చేత ఒక సందేశాన్ని ఇప్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా అయిపోయిన వెంటనే రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమాలో నటించాల్సి ఉంది మహేష్ బాబు.


ఇక ఈ సినిమాతో మహేష్ బాబు ఈ సందేశాత్మక సినిమాలకు బ్రేక్ వేస్తున్నట్లుగా తెలుస్తోంది.ఈ సినిమా రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇటీవల మాట్లాడుతూ మహేష్ సినిమాతో ఎలాంటి సందేశం ఇవ్వటం లేదని.. రెస్టారెంట్ కి వెళ్లి తినే విందు భోజనంలా ఈ చిత్రం ఉంటుందని తెలియజేశారు ప్రతి ప్రేక్షకులు కూడా తన జీవితంలో ఎక్స్పీరియన్స్ చేసే లైఫ్ టైం మెమోరీల ఈ చిత్రం ఉండబోతోంది అంటూ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ తెలియజేయడం జరిగింది. దీంతో మహేష్ సందేశాత్మక చిత్రాలకు బ్రేక్ పడిందని అభిమానులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: