విక్టరీ వెంకటేష్ …ఈయన ప్రస్తుతం హిట్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం లో తన ల్యాండ్ మార్క్ మూవీ ''సైంధవ్'' అనే సినిమా ను చేస్తున్నాడు..
వెంకటేష్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమాను పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతుందని తెలుస్తుంది.

నిహారిక ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ సినిమా ను భారీ స్థాయిలో నిర్మిస్తుండ గా.. సంతోష్ నారాయణ్ మ్యూజిక్ ను అందిస్తున్నాడు. కాగా ఈ సినిమాలో వెంకీకి జోడీగా కన్నడ భామ శ్రద్ధ శ్రీనాద్ నటిస్తుంది.. అసలు వెంకీ ల్యాండ్ మార్క్ మూవీ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తుంది అని టాక్ కూడా వచ్చింది..

అసలు వీరి కాంబోలో సినిమా వస్తుంది అని ఎప్పటి నుండో వార్తలు కూడా వస్తున్నా కూడా ఇంత వరకు ఈ కాంబో సెట్ అవ్వడం లేదు..వెంకీ నటించిన నువ్వు నాకు నచ్చావ్, మల్లేశ్వరి సినిమాలకు త్రివిక్రమ్ మాటలు అయితే అందించారు.. ఇవి ప్రేక్షకులకు ఇప్పటికీ కూడా గుర్తుండి పోయే సినిమాలుగా నిలిచి పోయాయి..

అయితే త్రివిక్రమ్ డైరెక్టర్ గా మారిన తర్వాత వేరే సినిమాకు మాటలు రాయడం అయితే తగ్గించేశారు.. ఇక త్రివిక్రమ్ డైరెక్టర్ గా ఒక సినిమాను వెంకటేష్ తో సినిమా చేయాలని ప్లానింగ్ లో ఉన్నప్పటికీ అది మాత్రం ఆచరణలో పెట్టడం లేదు.. ఈయన వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేయడంతో వెంకీ కోసం కథ రెడీ చేయడానికి త్రివిక్రమ్ కు సమయం సరిపోవడం లేదని తెలుస్తుంది...

ప్రెజెంట్ త్రివిక్రమ్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది.ఈ సినిమా ఇప్పటికే మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకుందట.. ఇక వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది.. ఆ తర్వాత మళ్ళీ అల్లు అర్జున్ తో సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది.. అందుకే వెంకీతో సినిమా ఎప్పుడు చేస్తాడో మరి తెలీదు.

మరింత సమాచారం తెలుసుకోండి: