సినిమా ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలో ఎక్కువ పాపులర్ అయిన హీరోయిన్లు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో మాలీవుడ్ బ్యూటీ కీర్తి సురేష్ ఒకరు. రామ్ హీరోగా ‘నేను శేలజ’ సినిమాతో తెలుగు లోకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి తర్వాత నేను లోకల్ సినిమాతో నాని సరసన నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత తమిళంలో విజయ్ సరసన నటించే అవకాశం లభించింది.
తెలుగు, తమిళ పరిశ్రమలో వరుస ఛాన్స్ లతో బిజీగా ఉన్న కీర్తి సురేష్ తెలుగు లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ‘మహానటి’తో టాప్ హీరోయిన్ల లీస్ట్ లోకి చేరింది. తాజాగా కీర్తి సురేష్ కి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే కీర్తి హీరో విజయ్ ను కాళ్లతో తొక్కుతూ కనిపించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
తమిళులు తమ అభిమాన హీరోలను ఎంతో ఆరాధిస్తుంటారు. తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత అంత మాస్ ఫాలోయింగ్ హీరో విజయ్ కి మాత్రమే వచ్చింది. అలాంటి విజయ్ కాలు తొక్కుతూ కీర్తి సురేష్ కి సంబంధించిన ఫోటో చూసి తమిళ తంబీలు ఫైర్ అవుతున్నారు. కీర్తి నీకు ఇంత పొగరా అంటూ ఆమెపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరోపక్క కీర్తి అభిమానులు మాత్రం ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.