ప్రముఖ దర్శకులు క్రిష్ ప్రస్తుతం ‘ఎన్టీఆర్’బయోపిక్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ బయోపిక్ లో బాలకృష్ణ నటిస్తున్నారు. ఎన్టీఆర్ జీవితంలో సినీ, రాజకీయ నేపథ్యలో రాబోతున్న ఈ సినిమాని రెండు భాగాలు గా తీయబోతున్నట్లు ఆ మద్య ప్రకటించారు చిత్ర యూనిట్. ఎన్టీఆర్ సినీ నేపథ్యంలో వచ్చేది ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, రాజకీయ నేపథ్యంలో వచ్చేది ‘ఎన్టీఆర్ మహానాయకుడు’. ఈ రెండు సినిమాలు జనవరిలో కొద్ది రోజుల వ్యవధిలో రిలీజ్ చేయబోతున్నారట.
సంక్రాంతి అంటే నందమూరి బాలకృష్ణకు ఎంతో సెంటిమెంట్ అన్న విషయం తెలిసిందే. ఎట్టి పరిస్థితుల్లో ఎన్టీఆర్ బయోపిక్ సంక్రాంతి బరిలో దించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ సినిమాలో సినీ నేపథ్యలో సాగు కథలో నాగేశ్వరరావుగా సుమంత్, ఎస్వీఆర్ పాత్రలో నాగబాబు, శ్రీదేవి పాత్రలో రకూల్ ప్రీత్ సింగ్, సావిత్రి పాత్రలో నిత్యామీనన్ నటిస్తున్నారు. తాజాగా సీనియర్ హీరోయిన్ శ్రియ కూడా ఈ సినిమా సెట్ లో జాయిన్ అయింది.
దర్శకుడు క్రిష్.. శ్రియపై ఓ పాటను చిత్రీకరించబోతున్నాడు. ఇక ఎన్టీఆర్ కెరీర్ లో 'దాన వీర శూర కర్ణ' అనే సినిమా అతడికి ఎంతో ఖ్యాతిని తీసుకొచ్చింది. ఈ సినిమాలో ఆయన నటనకు తెలుగు ప్రజలు నీరాజనాలు పలికారు. ఈ సినిమాలో దుర్యోధనుడిపై 'ఛాంగురే బంగారు రాజా' అనే పాటను చిత్రీకరించారు. ఆ పాటలపై ఎన్టీఆర్, ప్రభ ల నటనకు ఎన్నో ప్రశంసలు వచ్చాయి.
ఇప్పటికీ ఈ పాట వింటుంటే..వినసొంపుగా ఉంటుంది. అయితే 'ఛాంగురే బంగారు రాజా' పాటలో నటించిన ప్రభ స్థానంలో ఇప్పుడు శ్రియా ఆడిపాడబోతుందట. బాలయ్య-శ్రియలపై ఈ పాటను చిత్రీకరించనున్నారు. గతంలో బాలయ్య, శ్రియ కలిసి 'చెన్నకేశవ రెడ్డి','గౌతమీపుత్ర శాతకర్ణి','పైసా వసూల్' వంటి సినిమాల్లో నటించారు. తాజాగా ‘ఎన్టీఆర్’ బయోపిక్ లో కూడా ఈ జంట పాటపై నటించి మురిపించబోతుంది.