కే ఏ పాల్ గత కొన్ని రోజులుగా ఈ పేరు తెలియని వారు ఎవ్వరూ ఉండరు. అనుకోకుండా రాజకియాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఒకరకంగా చెప్పాలంటే చాలా కామెడీని సృష్టించారు ఈయన. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్ పాత్ర మనందరికీ తెలిసిందే. అన్ని పార్టీలను ఓడిస్తానని.. అధికారం తనదేనని శపథం చేసిన పాల్ ఎన్నికల తరవాత కనిపించనేలేదు.
ఈయన చేష్టలు, మాటల ద్వారా జనం బాగా ఎంటర్టైన్ అయ్యారు. అందుకే సినిమా వాళ్ళ కన్ను ఆయనపై పడింది. కేఏ పాల్ బయోపిక్ తీసే ఆలోచనలో ఉన్నాడు ఓ కొత్త దర్శకుడు. ఇందులో పాల్ పాత్రలో ప్రముఖ హాస్య నటుడు సునీల్ నటించనున్నారట. ఇందులో ఇద్దరు హీరోయిన్లు కూడా ఉంటారని తెలుస్తోంది.
ప్రముఖ క్రైస్తవ మత ప్రచారకుడు, ఇటీవల రాజకీయాలలో తన స్టేట్మెంట్లతో కామెడీ సృష్టించిన కేఏ పాల్ పాత్ర తెరకెక్కనుంది. ఈయన జీవన ప్రస్థానాన్ని ఆధారంగా చేసుకుని ఓ చిత్రం రూపొందనున్నట్టు, ఇందులో పాల్ పాత్రను ప్రముఖ హాస్య నటుడు సునీల్ పోషించనున్నట్టు తెలుస్తోంది.
ఎన్నికల వేళ పాల్ చేసిన ఫీట్లకు ఆకర్షితులైన సినీ నిర్మాతలు ఆయన బయోపిక్ తీసేందుకు క్యూ కడుతున్నారు. ఇందుకోసం ఓ కొత్త దర్శకుడు కథను రెడీ చేస్తుండగా ఇందులో పాల్ పాత్రలో ప్రముఖ హాస్య నటుడు సునీల్ నటించనున్నాడు. ఇందులో ఇద్దరు హీరోయిన్లు కూడా ఉంటారని తెలుస్తోంది. అయితే ఈ వార్తపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.