రబ్బిట్ మ్యాక్ ఈ పేరు తో తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు కానీ ఈయన పాడిన పాటలు మాత్రం వాళ్లను ఫుల్ గా అలరించాయి. మలేషియన్ ర్యాప్ సింగర్ అయిన రబ్బిట్ ప్రైవేట్ ఆల్బమ్స్ ద్వారా మలేషియా తోపాటు ఆసియా దేశాలైన ఇండియా , సింగపూర్ , శ్రీలంక లో కూడా పాపులర్ అయ్యాడు. ఇక తమిళ సంగీత దర్శకుఢు యువన్ శంకర్ రాజా తొలిసారి సౌత్ సినిమాలో రబ్బిట్ చేత సాంగ్ పాడించాడు.
ఆ తరువాత బన్నీ నటించిన 'రేసు గుర్రం' సినిమాతో తమన్ మొదటి సారి రబ్బిట్ తో తెలుగులో పాట పాడించారు. ఆ సినిమాలో 'స్వీటీ' అనే సాంగ్ ను రబ్బిటే పాడాడు. ఈసాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. ఇక ఈ సాంగ్ తరువాత రబ్బిట్ తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'బ్రూస్ లీ' లో రెండో సారి పాట పాడించాడు తమన్. ఆ సినిమా లో ఆయన పాడిన 'రియా రియా' అనే సాంగ్ కూడా సూపర్ హిట్ అయ్యింది.
ఇక ఇప్పుడు అల్లు అర్జున్ 19వ సినిమా కోసం తమన్ , రబ్బిట్ మరోసారి కలిసి పనిచేస్తున్నారు. ఈసినిమాలో తమన్ , రబ్బిట్ తో ఓ సాంగ్ ను పాడిస్తున్నాడు. ఇక ఈ చిత్రం యొక్క షూటింగ్ ప్రస్తుతం కాకినాడ లో జరుగుతుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా టబు , నవదీప్ , సుశాంత్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. హరిక హాసిని క్రియేషన్స్ , గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబర్ లో ప్రేక్షకులముందుకు వచ్చే అవకాశాలు వున్నాయి.