తమిళ హీరో కార్తి నటించిన లేటెస్ట్
మూవీ ఖైదీ ఇటీవల విడుదలై యూనానిమస్ పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుంది. మొదటి రోజు నిరాశపరిచినా మౌత్ టాక్ బాగుండడం తో రోజు రోజుకు పుంజుకుంటుంది. ముఖ్యంగా ఈ చిత్రం హైదరాబాద్ లో డ్రీం రన్ ను కొనసాగిస్తుంది.
వీక్ డేస్ లో కూడా మల్టీ ఫ్లెక్స్ షోస్ హౌస్ ఫుల్ తో రన్ అవుతున్నాయి. అంతే కాదు నిన్న బుక్ మై షో లో
హైదరాబాద్ లో ఈచిత్రం హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఇక మొదటి వారంలో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 3.5కోట్ల షేర్ ను రాబట్టిందని సమాచారం. దాంతో ఇప్పటికే చాలా ఏరియాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యింది. ఫుల్ రన్ లో ఈ చిత్రం మరో మూడు కోట్ల వరకు రాబట్టడం ఖాయంగా కనిపిస్తుంది. అటు
కోలీవుడ్ లో కూడా
ఖైదీ సత్తా చాటుతుంది. మొదటి వారం లో అక్కడ 20కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్ వద్ద రెండో స్థానంలో దూసుకుపోతుంది.
హీరోయిన్ ,సాంగ్స్ లేకుండా కేవలం ఒక్క రాత్రి లో జరిగే స్టోరీ తో
లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని డ్రీం
వారియర్ పిక్చర్స్ పతాకం పై ఎస్ ఆర్ ప్రభు నిర్మించగా
సామ్ సీఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. తెలుగు లో ఈ చిత్రాన్ని శ్రీ
సత్య సాయి ఆర్ట్స్ అధినేత కేకే రాధామోహన్ విడుదలచేశారు. ఈచిత్రానికి సీక్వెల్ కూడా రానుందని ఇటీవల
కార్తి మీడియా సమావేశం లో వెల్లడించిన విషయం తెలిసిందే. అన్ని కుదిరితే వచ్చే ఏడాది
ఖైదీ 2 సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు వున్నాయి.