ముందుగా శ్రీకాంత్ అడ్డాల ఈ కథను ఎన్టీఆర్ కు చెప్పాడట. అయితే ఎన్టీఆర్ కథ నచ్చక చేయననడంతో చివరకు మహేష్ ను ఒప్పించి ఈ సినిమా చేశాడు. ఈ సినిమా మహేష్ పరువు గంగలో కలిపేసింది. ఇక స్టార్ రైటర్ వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయం అయిన నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా కథను ఎన్టీఆర్ తో చేయాలని రెండు సంవత్సరాలుగా వెయిట్ చేశాడు. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా పట్టాలెక్కుతోందని కూడా అందరూ అనుకున్నారు. అయితే ఈ కథకు ఒకానొక దశలో ఎన్టీఆర్ ఓకే చెప్పడం కూడా జరిగిందని అని అంటారు.
అయితే అనూహ్యంగా బాబి జై లవకుశ కథ ఎన్టీఆర్ కు చెప్పడంతో ఆ సినిమా చేసేందుకు ఎన్టీఆర్ మొగ్గు చూపాడు. దీంతో వంశీ ఈ కథను అల్లు అర్జున్ తో చేసి డిజాస్టర్ ఇచ్చాడు. ఇక శతమానం భవతి లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాను ఇచ్చిన దర్శకుడు సతీష్ వేగేశన శ్రీనివాస కళ్యాణం సినిమా కథను ముందుగా ఎన్టీఆర్ కు చెప్పారు. నిర్మాత దిల్ రాజు సైతం ఈ సినిమాని తీయాలని అనుకున్నారు. అయితే ఎన్టీఆర్ ఈ కథను తిరస్కరణ చేయడం తో చివరకు నితిన్ తో చేసి ప్లాప్ కొట్టారు. అలా ఎన్టీఆర్ ఈ మూడు కథలను రిజెక్ట్ చేసి మూడు ప్లాప్ సినిమాలు తప్పించుకున్నాడు.