అసలు బాలయ్య తోటి నటీనటులను ఇంటర్వ్యూ చేస్తుండడంతో ప్రేక్షకులు మాత్రమే కాదు యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీ వాళ్లు సైతం ఎంతో ఆసక్తిగా చూశారు. ఆహా ఓటీటీ బాలకృష్ణతో షో నిర్వహించనున్నామని ప్రకటించిననాటి నుంచి ఈ షోపై ఎక్కడలేని క్యూరియాసిటీ ఏర్పడింది. అయితే ఇప్పటికే వచ్చిన రెండు షోలు కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇక బాలయ్య మూడో ఎపిసోడ్ లో బ్రహ్మానందాన్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు.
నాలుగో ఎపిసోడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయనున్నారు. ఇదిలా ఉంటే బోయపాటి దర్శకత్వంలో బాలయ్య చేసిన అఖండ సినియా రేపు రిలీజ్ అవుతోంది. ఈ సినిమా తర్వాత బాలయ్య వరుస పెట్టి క్రేజీ దర్శకులతో సినిమాలు చేయనున్నాడు. బాలయ్య లైనప్ లో ఉన్న దర్శకులను చూస్తే అఖండ సినిమా తర్వాత గోపీచంద్ మలినేనితో ఓ సినిమా చేయనున్నారు.
క్రాక్ తర్వాత మలినేని గోపీచంద్ డైరెక్ట్ చేస్తోన్న సినిమా ఇదే. ఈ సినిమా కూడా పూర్తికాగానే పూరి జగన్నాథ్, అనీల్ రావిపూడి సినిమాలు లైన్లో ఉన్నాయి. ఆ తర్వాత క్రిష్ తో మరో సినిమా కూడా ఉంది. ఇవన్నీ కూడా క్రేజీ దర్శకుల కాంబోలో వస్తో న్న సినిమా లు కావడంతో వీటి పై భారీ అంచనా లు ఉన్నాయి. ఏదేమైనా బాలయ్య వరుస సినిమాలతో బిజీ కానున్నా డు.