తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి,హీరో కృష్ణ సతీమని ఇందిరా దేవి గురించి అందరికి తెలిసిందే..మహేష్ బాబుకు తన తల్లి అంటే ఎంత ఇష్టమో తెలుసు..తన తల్లి గురించి మాట్లాడేటపుడల్లా మహేష్ బాబు కళ్ళలో నీళ్లు తిరగడం మనం ఎన్నో సార్లు గమనించి ఉంటాము..ఆయనకీ తన తల్లి గారితో ఉన్న అనుబంధం అలాంటిది.. తల్లికి ఆరోగ్యం సీరియస్ అవ్వడం తో AIG హాస్పిటల్స్ లో చేర్చారు..ప్రస్తుతం ఎమెర్జెనీ వార్డులో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు..



ఇందిరమ్మ, కృష్ణ గారిని 1961 వ సంవత్ర్సం లో పెళ్లి చేసుకున్నారు.. మహేష్ బాబు తో పాటు రమేష్ బాబు మరియు మంజుల కి జన్మని ఇచ్చారు ఇందిరమ్మ గారు..ఇక ఆ తర్వాత కృష్ణ గారు 1969 సంవత్సరం లో విజయ నిర్మల గారిని రెండవ పెళ్లి చేసుకున్నారు..విజయ నిర్మల గారిని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఇందిరమ్మ గారితో దాంపత్య జీవితం కొనసాగించారు కృష్ణ గారు..విజయ నిర్మల గారు కృష్ణ గారి సినిమాల వ్యవహారాలు మరియు కృష్ణ గారికి సంబంధించిన అన్నీ కార్యక్రమాలను దగ్గరుండి చూసుకునేవారు..విజయ నిర్మల గారు 2019 వ సంవత్సరం లో చనిపోయిన సంగతి మన అందరికి తెలిసిందే..



ఇటీవల కృష్ణ గారి పెద్ద కుమారుడు రమేష్ బాబు గారు ఇటీవలే కన్నుమూశారు.. కృష్ణ గారితో పాటు ఘట్టమనేని కుటుంబం మొత్తానికి ఇది కోలుకోలేని దెబ్బ..ఇప్పుడు ఇందిరమ్మ గారి ఆరోగ్యం కూడా క్షీణించడం తో మహేష్ బాబు అభిమానులు ఆందోళన చెందుతున్నారు.త్వరలోనే ఆమె కోలుకుంటారని..ఆమె కోలుకోవడానికి అభిమానులందరూ ఆ దేవుడికి ప్రార్థన చెయ్యాలని కృష్ణ గారి సన్నిహిత వర్గాలు చెప్తున్నారు.. ప్రస్తుతం మహేష్ బాబు గారు AIG హాస్పిటల్స్ దగ్గరే ఉన్నాడు. ఆమె ఆరోగ్య పరిస్థితి పర్వాలేదని వైద్యలు చెప్పారు..ప్రస్తుతం అబ్జర్వేషన్ లో ఉందని,త్వరలోనే పూర్తి వివరాలను తెలుపుతామని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: