టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయినటు వంటి విజయ్ దేవరకొండ ఆఖరుగా లైగర్ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా రూపొందిన ఈ సినిమాకు డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించగా ... అనన్య పాండేమూవీ లో హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల నడుమ తెలుగు ,  తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో విడుదల అయిన ఈ మూవీ ప్రేక్షకులను ఏ మాత్రం అలరించ లేక పోయింది. 

ఇలా లైగర్ లాంటి భారీ ఫెయిల్యూర్ తర్వాత విజయ్ ... శివ నర్వాన దర్శకత్వంలో రూపొందుతున్న ఖుషి అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. అలాగే ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన చాలా భాగం షూటింగ్ కూడా పూర్తి అయింది. ఇది ఇలా అంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక అదిరిపోయే అప్డేట్ ను ప్రకటించింది.

 తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా 1 సెప్టెంబర్ 2023 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ మూవీ విడుదల తేదీని ప్రకటిస్తూ ఈ చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది వరకే విజయ్ ... సమంత కలిసి మహానటి మూవీ లో నటించారు. ఇది వీరిద్దరి కాంబినేషన్ లో రెండవ సినిమా.

మరింత సమాచారం తెలుసుకోండి: