తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం అద్భుతమైన క్రేజ్ ఉన్న నిర్మాణ సంస్థలలో మైత్రి మూవీ సంస్థ ఒకటి. ఈ నిర్మాణ సంస్థ వారు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా శృతి హాసన్ హీరోయిన్ గా కొరటాల శివ దర్శకత్వం లో రూపొందిన శ్రీ మంతుడు అనే సినిమాతో నిర్మాణ రంగం లోకి అడుగు పెట్టారు. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో మైత్రి సంస్థ కు తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత వీరు వరసగా జనతా గ్యారేజ్ , రంగస్థలం సినిమాలను నిర్మించారు.

ఈ రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ విజయాలను అందుకోవడంతో ఒక్క సారిగా ఈ నిర్మాణ సంస్థ టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ స్థానానికి వెళ్లిపోయింది. ఇక అప్పటి నుండి మొదలు ఈ బ్యానర్ వారు వరుసగా సినిమాలను నిర్మిస్తూనే వస్తున్నారు. అలాగే ఈ బ్యానర్ వారు నిర్మించిన సినిమాలలో చాలా శాతం సినిమాలు అద్భుతమైన విజయాలను అందుకుంటు ఉండడంతో  ఈ నిర్మాణ సంస్థ క్రేజ్ రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది.

ఇకపోతే ఈ నిర్మాణ సంస్థ వారు కొంత కాలం క్రితం "పుష్ప పార్ట్ 1" అనే సినిమాను రూపొందించారు. అల్లు అర్జున్ హీరో గా రూపొందిన ఈ సినిమాను సుకుమార్ దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం ఈ సినిమాకు కొనసాగింపుగా ప్రస్తుతం "పుష్ప పార్ట్ 2" మూవీ తెరకెక్కుతుంది. ఈ సినిమాను ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని ఈ సంస్థ వారు "యూ ఎస్ ఏ" లో ఓన్ గా రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆగస్టు 14 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్స్ ని "యూ ఎస్ ఏ" లో ప్రదర్శించబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: