తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న మాస్ దర్శకులలో బోయపాటి శ్రీను ఒకరు. ఈయన భద్ర అనే మూవీ తో దర్శకుడి గా తన కెరియర్ ను మొదలు పెట్టాడు. ఇకపోతే ఈయన ఇప్పటి వరకు తన కెరియర్ లో చాలా సినిమాలకు దర్శకత్వం వహించాడు. అందులో అనేక మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి. ఇకపోతే ఈయన ఆఖరుగా రామ్ పోతినెని హీరో గా ... శ్రీ లీల హీరోయిన్ గా స్కంద అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ని తెరకెక్కించాడు.

భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇకపోతే ఈ సినిమా తర్వాత ఈయన బాలకృష్ణ హీరో గా "అఖండ 2" మూవీ ని చేయబోతున్నట్లు అనేక వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ తర్వాత బోయపాటి ఓ భారీ మల్టీ స్టారర్ మూవీ ని ప్లాన్ చేస్తున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... గత కొంత కాలంగా రెబల్ స్టార్ ప్రభాస్ ... మ్యాచో స్టార్ గోపీచంద్ కాంబో లో ఓ మూవీ రాబోతుంది అంటూ ఓ వార్త వైరల్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే బోయపాటి వీరిద్దరి కాంబినేషన్ లో ఓ భారీ మల్టీ స్టారర్ సినిమా తెరకెక్కిస్తే సూపర్ గా ఉంటుంది అని ఆలోచనలో ఉన్నట్లు ప్రస్తుతం అందుకు సంబంధించిన కథ పనుల్లో బోయపాటి ఫుల్ బిజీగా ఉన్నట్లు ఒక వేళ కథ కనుక సూపర్ గా సెట్ అయినట్లు అయితే వీరికి కథ చెప్పే ఆలోచనలో బోయపాటి ఉన్నట్లు ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: