తెలుగు యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. కార్తికేయ-2 మూవీతో ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్ దక్కించుకున్నారో అందరికీ తెలిసిందే. 2014లో వచ్చిన కార్తికేయ మూవీకి సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కి అద్భుత విజయం సాధించింది.నిఖిల్ కెరీర్ లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ.120 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. సస్పెన్స్ థ్రిల్లర్ కు మైథాలజీ కాన్సెప్ట్ యాడ్ చేసి రూపొందించిన ఈ మూవీతో పాన్ ఇండియా హీరో అయిపోయాడు నిఖిల్.అయితే కార్తికేయ-2 బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో దీనికి కూడా సీక్వెల్ కార్తికేయ-3 ఉంటుందని మేకర్స్ అప్పుడే ప్రకటించడం జరిగింది.సినిమాలో కూడా చివర్లో హిట్ ఇచ్చారు. అయితే ఆ సినిమా ఎప్పుడు ఉంటుందో ఇంతవరకు చెప్పలేదు. దీని కోసం ఎప్పటి నుంచో కార్తికేయ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. తాజాగా కార్తికేయ-3 గురించి నిఖిల్ అప్డేట్ ఇచ్చారు. త్వరలోనే కార్తికేయ-3 సినిమా రానుందని సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు.''డాక్టర్ కార్తికేయ.. సరికొత్త అడ్వెంచర్‌ ను సెర్చ్‌ చేసే పనిలో బిజీగా ఉన్నారు. త్వరలోనే రానున్నాం'' అంటూ నిఖిల్ తెలిపారు.


దాంతోపాటు రెండు ఫోటోలను కూడా షేర్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారిన ఈ పోస్ట్ పై నెటిజన్లు స్పందిస్తున్నారు. మరో అడ్వెంచర్‌ థ్రిల్లర్‌ చూసేందుకు తాము రెడీగా ఉన్నామంటూ  నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఈసారి ఎలాంటి ట్విస్ట్ ఇస్తారో చూడాలని చాలా ఆసక్తిగా ఉన్నట్లు చెబుతున్నారు.ప్రస్తుతం కార్తికేయ-3 సినిమా స్క్రిప్ట్ వర్క్స్ జరుగుతున్నట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. గత రెండు సినిమాలతో పోలిస్తే ఈ మూవీ భారీ స్థాయిలో తెరకెక్కనుందని సమాచారం తెలుస్తుంది. యంగ్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వంలో నిఖిల్‌ హీరోగా తెరకెక్కనున్న మూడో సినిమా ఇది. అయితే కార్తికేయ-2 సినిమాలో బాలీవుడ్ నటుడు అనుపమ్‌ ఖేర్‌ కృష్ణతత్వాన్ని ఉద్దేశించి చెప్పే డైలాగ్స్‌ సీన్ ఎంత వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాకు మెయిన్ హైలైట్ అదే. కార్తికేయ 3 లో అంతకంటే మించి గూస్ బంప్స్ సీన్స్ ఉంటాయట.

మరింత సమాచారం తెలుసుకోండి: