1994లో తొలిసారి బీనాను వివాహం చేసుకున్నాడు పృథ్వీరాజ్. వీరిద్దరికీ ఓ బాబు అహద్ మెహన్ జబ్బర్ అనే కొడుకు పుట్టాడు. అయితే చాలా కాలంపాటు అన్యోన్యంగా ఉన్న వీరి జంట మధ్య సమస్యలు రావడంతో దూరం అవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈక్రమంలోనే ఇద్దరూ కలిసి ఆరు సంవత్సరాల పాటు విడివిడిగా జీవించారు. 2022లోనే చట్టబద్ధంగా విడాకులు తీసుకొని వేరయ్యారు. ఆ తర్వాత కొంత కాలం ఒంటరిగా ఉన్న పృథ్వీరాజ్.. రుక్మిణి శీతల్ కు దగ్గరయ్యాడు.అయితే ఇంతలో ఏమైందో తెలియదు కానీ వారిద్దరూ విడిపోతున్నట్లు రూమర్స్ జోరుగా వినిపిస్తున్నాయి. శీతల్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి పృథ్వీరాజ్ ప్రపోజ్ చేసిన వీడియోను తొలిగించడం కూడా ఈ వదంతులకు బలాన్ని ఇచ్చాయి. తాజాగా తమ ప్రేమ వ్యవహారం గురించి శీతల్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో క్లారిటీ ఇచ్చారు. ''ఈ మధ్య చాలా మంది నా జీవితంలో ఏం జరుగుతోందని ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉన్నారు.నా పరిస్థితిని ఏ మాత్రం అర్థం చేసుకోకుండా ఏవేవో ఊహాగానాలు ప్రచారం చేస్తున్నారు. అందరికీ చెప్పేదేంటంటే.. నేను, పృథ్వీరాజ్ పెళ్లి చేసుకోలేదు. కొన్నాళ్లు సహజీవనం చేశామంతే మేము కలలు కన్న విధంగా మా బంధం ముందుకు సాగలేకపోయింది. అయితే, ఈ చిన్నపాటి బాంధవ్యంలో మేము ఎన్నో మధుర స్మృతులు పంచుకున్నాం. ఎన్నో సంతోష క్షణాలు కలసి అనుభవించాం. కొన్నివిషయాల్లో మా ఇద్దరి మధ్య సఖ్యత కుదరకపోవడంతో కొద్ది నెలల క్రితమే విడిపోయాం.జరిగిందేదో జరిగిపోయింది. ఇక నుంచైనా మా నిర్ణయాన్ని గౌరవిస్తూ.. మా పరిస్థితిని అర్థం చేసుకుని, వ్యక్తిగత గోప్యతకు ఎలాంటి భంగం కలిగించరని ఆశిస్తున్నాను'' అని శీతల్ పేర్కొంది. అయితే, తన ఖాతాలో స్టోరీ పెట్టిన కొద్దిసేపటికే శీతల్ ఆ పోస్ట్ను తొలగించడం గమనార్హం.
1994లో తొలిసారి బీనాను వివాహం చేసుకున్నాడు పృథ్వీరాజ్. వీరిద్దరికీ ఓ బాబు అహద్ మెహన్ జబ్బర్ అనే కొడుకు పుట్టాడు. అయితే చాలా కాలంపాటు అన్యోన్యంగా ఉన్న వీరి జంట మధ్య సమస్యలు రావడంతో దూరం అవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈక్రమంలోనే ఇద్దరూ కలిసి ఆరు సంవత్సరాల పాటు విడివిడిగా జీవించారు. 2022లోనే చట్టబద్ధంగా విడాకులు తీసుకొని వేరయ్యారు. ఆ తర్వాత కొంత కాలం ఒంటరిగా ఉన్న పృథ్వీరాజ్.. రుక్మిణి శీతల్ కు దగ్గరయ్యాడు.అయితే ఇంతలో ఏమైందో తెలియదు కానీ వారిద్దరూ విడిపోతున్నట్లు రూమర్స్ జోరుగా వినిపిస్తున్నాయి. శీతల్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి పృథ్వీరాజ్ ప్రపోజ్ చేసిన వీడియోను తొలిగించడం కూడా ఈ వదంతులకు బలాన్ని ఇచ్చాయి. తాజాగా తమ ప్రేమ వ్యవహారం గురించి శీతల్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో క్లారిటీ ఇచ్చారు. ''ఈ మధ్య చాలా మంది నా జీవితంలో ఏం జరుగుతోందని ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉన్నారు.నా పరిస్థితిని ఏ మాత్రం అర్థం చేసుకోకుండా ఏవేవో ఊహాగానాలు ప్రచారం చేస్తున్నారు. అందరికీ చెప్పేదేంటంటే.. నేను, పృథ్వీరాజ్ పెళ్లి చేసుకోలేదు. కొన్నాళ్లు సహజీవనం చేశామంతే మేము కలలు కన్న విధంగా మా బంధం ముందుకు సాగలేకపోయింది. అయితే, ఈ చిన్నపాటి బాంధవ్యంలో మేము ఎన్నో మధుర స్మృతులు పంచుకున్నాం. ఎన్నో సంతోష క్షణాలు కలసి అనుభవించాం. కొన్నివిషయాల్లో మా ఇద్దరి మధ్య సఖ్యత కుదరకపోవడంతో కొద్ది నెలల క్రితమే విడిపోయాం.జరిగిందేదో జరిగిపోయింది. ఇక నుంచైనా మా నిర్ణయాన్ని గౌరవిస్తూ.. మా పరిస్థితిని అర్థం చేసుకుని, వ్యక్తిగత గోప్యతకు ఎలాంటి భంగం కలిగించరని ఆశిస్తున్నాను'' అని శీతల్ పేర్కొంది. అయితే, తన ఖాతాలో స్టోరీ పెట్టిన కొద్దిసేపటికే శీతల్ ఆ పోస్ట్ను తొలగించడం గమనార్హం.