దర్శక దీరుడు ఎస్ ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకం గా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి అందు లో ప్రతి మూవీ తోనూ అద్భుతమైన విజయాన్ని అందుకొని తన క్రేజ్ ను ప్రపంచ వ్యాప్తంగా పెంచుకున్నాడు . ఇక పోతే బాహుబలి సిరీస్ మూవీ లతో ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న రాజమౌళి ఆ తర్వాత "ఆర్ ఆర్ ఆర్" అనే సినిమాకు దర్శకత్వం వహించాడు . ఈ మూవీ కి ఆస్కార్ అవార్డు రావడంతో రాజమౌళి కి ఈ సినిమా ద్వారా ప్రపంచ వ్యాప్తంగా సూపర్ క్రేజ్ లభించింది.

ఇకపోతే రాజమౌళి తన తదుపరి మూవీ ని మహేష్ బాబు తో చేయబోతు న్న విషయం మన అందరికీ తెలిసిందే . రాజమౌళి తాజాగా ఓ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఆ ఈవెంట్ లో భాగంగా మహేష్ మూవీ కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను రాజమౌళి తెలియ చేశాడు . రాజమౌళి తాజాగా మాట్లాడుతూ ... నా నెక్స్ట్ మూవీ కి సంబంధించిన కథ పనులు మొత్తం పూర్తి అయ్యాయి. నటీ నటుల ఎంపిక పూర్తి కాలేదు.

కాకపోతే నా సినిమాలో ప్రధాన పాత్రలో నటించే హీరో మాత్రం ఎంపిక అయ్యాడు. అతను మహేష్ బాబు. మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలియజేస్తాం. అలాగే ఈ సినిమా షూటింగ్ ను కూడా చాలా తొందరగా పూర్తి చేసి జనాల ముందుకు ఈ మూవీ ని తీసుకువస్తాం అని రాజమౌళి తెలియ జేశాడు. ఇకపోతే రాజమౌళి , మహేష్ కాంబో లో రూపొందబోయే సినిమాపై ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: