మొదట డైరెక్టర్ రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఝుమ్మంది నాదం సినిమాలో హీరోయిన్గా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ తాప్సిసినిమా అద్భుతమైన విజయమందుకోవడంతో ఆ తర్వాత ప్రభాస్ తో కలిసి మిస్టర్ ఫర్ఫెక్ట్ వంటి సినిమాలో కూడా నటించింది. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించిన తాప్సి పెద్దగా కలిసి రాలేదు. దీంతో ఆ వెంటనే బాలీవుడ్ వైపుగా అడుగులు వేసిన తాప్సి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకున్నది. ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో నటించింది.

ఇదంతా ఇలా ఉంటే తాప్సి గత కొంతకాలంగా డెన్మార్క్ బ్యాడ్మింటన్ మథియస్ తో ప్రేమాయణం కొనసాగిస్తోందని ఎన్నోసార్లు మీడియా కంటపడినట్లుగా కూడా వార్తలు వినిపించాయి.. అయితే ఇప్పుడు ఒక్కసారిగా వీరిద్దరూ సీక్రెట్ గా వివాహం చేసుకున్నట్లు సమాచారం. అది కూడా ఈ నెల 23వ తేదీని వివాహం అయిపోయినట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం బంధువులు స్నేహితులు మధ్యలోనే హృదయపూర్వక తెలుస్తోంది.. అయితే తాప్సి స్నేహితురాలు పవైల్ గులాటి, కనిక దిల్లాన్, అనురాగ్ కశ్యప్ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేశారు.



అయితే వీరు షేర్ చేసిన ఫోటోల లో తాప్సి కానీ తన బాయ్ ఫ్రెండ్ కానీ ఎక్కడ కనిపించలేదు.. కానీ వీరు రాసుకొచ్చిన ప్రకారం వీరు ఒక పెళ్లిలో ఉన్నామని అది ఎవరిదో ఊహించలేరు అంటూ కూడా కొటేషన్తో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సైతం వైరల్ గా మారుతున్నాయి దీంతో పలువురు నెటిజన్ సైతం తాప్సి పెళ్లి అయిపోయిందా అంటూ ఆశ్చర్యపోతున్నారు అభిమానులైతే ఈ విషయం తెలిసి వీరికి విషెస్ తెలియజేస్తున్నారు. త్వరలోనే తన పెళ్లి మ్యాటర్ ని సైతం తాప్సినే రివీల్ చేస్తుందేమో చూడాలి మరి. ప్రస్తుతం ఇందుకు సంబంధించి కొన్ని ఫోటోలు అయితే వైరల్ గా మారుతున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: