టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన నటులు అయినటువంటి శ్రీ విష్ణు , ప్రియదర్శి , రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో తాజాగా "ఓం భీమ్ బుష్" అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మార్చి 22 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల అయింది.  ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి పాజిటివ్ టాక్ రావడంతో ఈ మూవీ కి ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లు దక్కుతున్నాయి. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన 3 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. 3 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ ల వివరాలు తెలుసుకుందాం.

మూవీ కి 3 రోజుల్లో నైజాం ఏరియాలో 2.15 కోట్ల కలెక్షన్ లు దక్కగా ... ఆంధ్ర ప్రదేశ్ లో 2.10 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు విడుదల అయిన 3 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 4.25 కోట్ల షేర్ ... 7.69 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి 3 రోజుల్లో కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్ సీస్ లలో కలుపుకొని 1.55 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. ఈ సినిమాకు 3 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 5.80 కోట్ల షేర్ ... 10.80 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 9.30 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా ఈ మూవీ 10 కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బారిలోకి దిగింది. ఈ మూవీ క్లీన్ హిట్ గా నిలవాలి అంటే మరో 4.20 కోట్ల షేర్ కలక్షన్ లను వరల్డ్ వైడ్ గా రాబట్ట వలసి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

sv