టాలీవుడ్ కోలీవుడ్ హీరో సిద్ధార్థ్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. బాయ్స్ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ నటుడు అతి తక్కువ సమయంలో లవర్ బాయ్ అనే ట్యాగ్ను కూడా సంపాదించుకున్నారు. 2005లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న సిద్ధార్థ్.. ప్రభుదేవా డైరెక్షన్లో ఈ సినిమా వచ్చి బ్లాక్ బాస్టర్ విజయం గా నిలిచింది. ఆ తర్వాత తెలుగులో ఒక్కసారిగా భారీ క్రేజీ సంపాదించుకున్నారు సిద్ధార్థ్.. ఆ తర్వాత చుక్కల్లో చంద్రుడు ,బొమ్మరిల్లు ,కొంచెం ఇష్టం కొంచెం కష్టం తదితర చిత్రాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు.


బొమ్మరిల్లు సినిమా సిద్ధార్థ్ కెరియర్ లోనే బ్లాక్బస్టర్ విజయంగా నిలిచింది. కొంచెం ఇష్టం కొంచెం కష్టం , ఓయ్ చిత్రాలు కూడా మంచి విజయాలను అందుకున్నాయి. ఆ తర్వాత సిద్ధార్థ్ తమిళ ఇండస్ట్రీ వైపుగా ఎక్కువగా దృష్టి పెట్టి అక్కడే సినిమాలు చేశారు. మళ్లీ చాలాకాలం తర్వాత మహాసముద్రం అనే సినిమాలో నటించారు.ఈ సినిమా ఫ్లాప్ గా మిగిలింది. ఈమధ్య వచ్చిన చిన్నా అనే సినిమాతో మరో సూపర్ హిట్ని అందుకున్నారు.

సిద్ధార్థ్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. నిన్నటికి పెళ్లయింది అన్న విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. 2003లో వివాహమైంది. సిద్ధార్థ్ కు పిల్లలు కూడా ఉన్నారు.సిద్ధార్థ్ మాత్రం ఇప్పటికీ యుంగ్ హీరో లాగా కనిపిస్తూ ఉన్నారు. సిద్దు ప్రేమించిన అమ్మాయి పేరు మేఘన.. ఈమె న్యూఢిల్లీలో తన ఇంటి పక్కనే ఉంటుందట. ఆమెని పెళ్లి చేసుకొని వీరికి పిల్లలు కూడా ఉన్నారు. కొన్ని కారణాల చేత వీరిద్దరూ 2007లో విడిపోయారు. అలా విడిపోవడానికి ముఖ్య కారణం బాలీవుడ్ నటి సోహ అలీ ఖాన్ తో ప్రేమలో ఉన్నారని రూమర్స్ రావడమే అన్నట్టుగా సమాచారం.. ఆ తర్వాత కమల్ హాసన్ కూతురు శృతిహాసన్తో కొన్నేళ్లు ప్రేమాయం నడిపారని వార్తలు వినిపించాయి. ఆ తర్వాత సమంతతో కూడా ప్రేమాయణం నడిపారు.. ఇప్పుడు తాజాగా అధితి  రావు హైదరిని పెళ్లి చేసుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీరిద్దరికీ ఇది రెండో పెళ్లి కావడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: