రౌడీ హీరో విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకి రానున్నారు. ఈ మూవీలో హీరోయిన్ గా భాగ్యశ్రీ బొర్సె నటిస్తుంది. ఈ సినిమా టైటిల్ కింగ్ డమ్ అని మూవీ మేకర్స్ ఫిక్స్ చేశారు. ఈ మూవీ మాస్ యాక్షన్ థ్రిల్లర్‌ అని తెలిసిందే. ఈ సినిమాను నాగవంశీ సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు తెలుగులో విజయ్ కి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఇవ్వగా.. తమిళం లో సూర్య, హిందీలో రణబీర్ కపూర్ వాయిస్ ఇచ్చారు. ఇక ఈ సినిమాకు స్టార్ హీరోలు వాయిస్ ఇవ్వడంతో ప్రేక్షకులలో అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.
 
ఇక ఇటీవలే ఈ మూవీ టీజర్ విడుదల అయ్యిందో.. లేదో రికార్డ్ స్థాయిలో వ్యూస్ వచ్చాయి. కొన్ని గంటల్లోనే యూట్యూబ్ లో ఈ మూవీ టీజర్ కు 10 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. ఈ మూవీలో యాక్షన్ సీన్స్ అలాగే డైలాగ్స్ ఉంటాయని మూవీ మేకర్స్ తెలిపారు. టీజర్ చూడగానే విజయ్ అభిమానులు బొమ్మ బ్లాక్ బస్టర్ అవుతుందని అంటున్నారు. ఈ సినిమా వేసవి సెలవులలో మే 30న రిలీజ్ అవ్వనుంది.

తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో విజయ్ ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. ఆయనకు ఒకే ఒక జీవితం సినిమాలో నటించేందుకు ఛాన్స్ వచ్చిందని అన్నారు. ఆ సినిమా స్క్రిప్ట్ ను ఆయన మూడుసార్లు విన్నట్లు తెలిపారు. ఆయనకి సినిమా చాలా నచ్చిందట. కానీ ఆ సినిమాకు తన బాడీలాంగ్వేజ్ సరిపోలేదనిపించి.. ఆ సినిమాలో నటించలేకపోయారని విజయం చెప్పుకొచ్చారు. ఇక ఆ సినిమాలో శర్వానంద్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. అక్కినేని అమల ఈ సినిమాలో అమ్మగా ముఖ్య పాత్రను పోషించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: