
జగన్ బీజేపీకి మద్దతు ఇస్తూ ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి ఓటు వేయడం అవమానకరమని ఆమె అన్నారు. వైఎస్ఆర్ జీవితకాలం బీజేపీని వ్యతిరేకించారని, జగన్ చర్యలు ఆయన సిద్ధాంతాలకు విరుద్ధమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సుదర్శన్ రెడ్డి వంటి న్యాయ నిపుణుడికి మద్దతు ఇవ్వకపోవడం దారుణమని ఆమె పేర్కొన్నారు.జగన్ బీజేపీకి దత్తపుత్రుడిగా మారారని, మోడీ ఆదేశాలకు అనుగుణంగా నడుస్తున్నారని షర్మిలా ఆరోపించారు. గంగవరం పోర్టును అదానీకి అప్పగించడం, రిలయన్స్కు రాజ్యసభ సీటు ఇవ్వడం వంటి చర్యలను ఆమె ప్రశ్నించారు.
ఐదేళ్ల అధికారంలో జగన్ బీజేపీ బిల్లులకు మద్దతు ఇచ్చారని, ఇది వైఎస్ఆర్ ఆదర్శాలకు ద్రోహమని ఆమె ఆక్షేపించారు.వైసీపీకి సిద్ధాంతాలు, లక్ష్యాలు లేవని షర్మిలా విమర్శించారు. జగన్ రాజకీయ వ్యాపారం చేస్తున్నారని, బీజేపీ తోక పార్టీగా వైసీపీ మారిందని ఆమె ఆరోపించారు. వైఎస్ఆర్ వారసత్వాన్ని జగన్ అవమానించారని, ఆయన చరిత్రలో ద్రోహిగా మిగిలిపోతారని ఆమె హెచ్చరించారు. బీజేపీకి మద్దతు ఇవ్వడం సిగ్గుచేటని, జగన్ తన వైఖరిని సమీక్షించుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు