
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తేజ సజ్జా మాట్లాడుతూ.. సినిమా కోసం చాలా కష్టపడ్డాము.. ఈ సినిమాను అందరికీ చూపించాలని ఉద్దేశంతోనే చిత్ర బృందంతో ఒక సంచలన నిర్ణయం తీసుకున్నామని.. ఆ విషయాన్ని తాను ఈవెంట్లో చెబుతున్నానని.. మా నిర్మాత టీజీ విశ్వప్రసాద్ గారు డిస్ట్రిబ్యూటర్లను ఒప్పించి మరి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాం.. మా సినిమా టికెట్ల రేట్లు పెంచలేదు.. సాధారణ ధరలకే టికెట్లను అందుబాటులోకి తీసుకువచ్చాము అందరూ సినిమా చూడాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నామంటూ తెలిపారు.
ఇది చాలా రిస్క్ తో కూడిన పని అని తెలుసు కానీ మీ కోసం, మా సినిమా కోసమే ఇలా చేస్తున్నామంటూ తేజ సజ్జా తెలియజేశారు. అలాగే యూఎస్ఏ లో కూడా టికెట్ ఓపెనింగ్స్ ఆల్రెడీ మొదలయ్యాయని తెలియజేశారు. హీరో తేజ సజ్జా చేస్తున్న పనిని మిగిలిన హీరోలు కూడా చేస్తే ఖచ్చితంగా ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే అవకాశం ఉంటుందని నెటిజన్స్ భావిస్తున్నారు. సినిమా టికెట్లు అధికంగా ఉండడం వల్లే చాలామంది వెనుకడుగు వేస్తున్నారు ప్రేక్షకులు. మిరాయ్ చిత్రంలో మంచు మనోజ్ విలన్ గా నటించాగ,రితిక నాయక్ హీరోయిన్ గా నటిస్తోంది. జగపతిబాబు, శ్రియ కీలకమైన పాత్రలో నటిస్తున్నారు.