అల్లు బ్రదర్స్ లో అల్లు శిరీష్ సిల్వర్ స్క్రీన్ పై సరైన హిట్టు తన ఖాతాలో వేసుకోలేకపోయాడు. శ్రీరస్తు శుభమస్తు సినిమా ఒక మాదిరిగా మెగా అభిమానులను అలరించిన..సోలోగా తన అన్న అల్లుఅర్జున్ మాదిరిగా మాత్రం తెలుగు ప్రేక్షకుల దగ్గర మార్కులు సాధించలేకపోయారు అని చాలామంది కామెంట్ చేస్తుంటారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుని సినిమా ఎంపిక చేసుకున్న కానీ సినిమా ఎక్కడో అక్కడ ఫెయిల్ అవటం దీంతో బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడటంతో అల్లు శిరీష్ సినిమా అయిపోయిందని చాలామంది ఇప్పటికే ఇండస్ట్రీలో ఉన్న వారు అభిప్రాయపడుతున్నారు
అయితే ఎవరు ఎన్ని ఏమన్నా గాని అల్లు శిరీష్ మాత్రం తన ప్రయత్నాలను ఏమాత్రం ఆపకుండా మంచి విజయం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. అందుకే ఈసారి రిస్క్ తక్కువ ఉండేలా చూసుకుని `ఏ బీ సీ డీ` అనే రీమేక్ కథ ఎంచుకున్నాడు. తీసింది చూసుకుంటూ, మార్పులు చేసుకుంటూ వెళ్లాడు. ముందు అనుకున్న బడ్జెట్ దారి తప్పినా – అస్సలు వెనుకంజ వేయడం లేదు. మంచి డేట్ కోసం.. విడుదల తేదీలు వాయిదా వేసుకుంటూ కాలక్షేపం చేశాడు.
మొత్తానికి ఈనెల 17కి ఈ సినిమా ఫిక్సయ్యింది. థియేటర్లో మహర్షి జోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. వీకెండ్ అయిన తరవాత కూడా.. వసూళ్లు బాగానే ఉన్నాయి. ఇవన్నీ శిరీష్ని కాస్త భయపెట్టేవే. మంచో, చెడో.. పాజిటీవ్గానో, నెగిటీవ్గానో సినీ పరిశ్రమ అంతా మహర్షి గురించే మాట్లాడుకుంటోంది. ఈ దశలో అల్లు శిరీష్ సినిమా రావడం రిస్కే అనుకోవాలి. కాకపోతే ఈ 17 దాటితే మళ్లీ బాక్సాఫీసు బిజీ అయిపోతుంది. చావో, రేవో ఇప్పుడే తేల్చేసుకోవాలి. ఒకవేళ గనుక ఈ సినిమా బాక్స్ ఆఫీసు దగ్గర బోల్తా పడింది అంటే అల్లూ శిరీష్ ఇంటికి బ్యాగ్ సర్దుకోవడం గ్యారెంటీ అనే కామెంట్లు వినబడుతున్నాయి.