బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంటూ,నటనకు ఆస్కారం ఉన్న పాత్రలను జాగ్రత్తగా ఎంచుకుంటూ తన సత్తా ఏంటో చూపిస్తూ వచ్చారు హీరో రాజ్కుమార్ రావు. కంగనా రనౌత్ లాంటి టాప్ హీరోయిన్లతో కలిసి స్క్రీన్ పంచుకున్న హీరో ఆయన. అతడు ప్రస్తుతం వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం రాజ్కుమార్ నటించిన మేడ్ ఇన్ చైనా షూటింగ్ పూర్తి కాగా,తదుపరి జాన్వీ కపూర్తో కలిసి జంటగా నటిస్తున్న రూహీ అఫ్జా సహా మరో రెండు సినిమాలు సెట్స్పైకి వెళ్లనున్నాయి.
ఈ తరుణంలో ఆయనకీ ఓ క్రేజీ ప్రాజెక్టులో నటించే ఛాన్స్ కూడా రాజ్కుమార్కే దక్కినట్లు సినీ వర్గం సమాచారం అందిచింది. 2008లో విడుదలైన
కరణ్ జోహార్ ప్రొడక్షన్ లో హిట్ అయిన మూవీ, దోస్తానా సీక్వెల్గా తెరకెక్కనున్న సంగతి అందరికి తెలిసిందే. కోలిన్ డి కున్హా దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్, కార్తిక్ ఆర్యన్లతో పాటు రాజ్కుమార్ను తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.
అయితే రాజ్కుమార్ మాత్రం దోస్తానా-2కు నో చెప్పారని,వేరే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిపారు. ఈ విషయం గురించి ముంబై మిర్రర్ ప్రస్తావించగా,ఆయన మాట్లాడుతూ నా తదుపరి సినిమాలో
ప్రియాంక చోప్రాకు జోడీగా కనిపించనున్నా. ఆ సినిమా షూటింగ్ కూడా దోస్తానా-2తో పాటు మొదలు కానుంది. అందుకే దోస్తానా టీంకు నో చెప్పాను అని వివరించారు.
కోలిన్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో తన క్లాస్మేట్ అని, దోస్తానా-2 కోసం కోలిన్ అద్భుతమైన స్క్రిప్టు రెడీ చేసారు.కానీ నేను తనతో చేసే ఛాన్స్ మిస్సయ్యాను అని చెప్పారు.పైగా అవార్డు విన్నింగ్ నవల ఆధారంగా, తెరకెక్కనున్న "ది వైట్ టైగర్" సినిమాలో ప్రియాంకతో కలిసి రాజ్కుమార్ నటించబోతున్నారు.ఈ సినిమాకు
ప్రియాంక చోప్రా నిర్మాతగా వ్యవహరిస్తున్నారని,అరవింద్ రచించిన ఈ నవల ప్రతిష్టాత్మకమయిన బుకర్ అవార్డు,గెలుచుకున్న విషయం అందరికి తెలిసిన విషయమే.నెట్ఫ్లిక్స్లో రిలీజ్ కానున్న ఈ మూవీ షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది.