ప్రస్తుతం సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన నేపద్యంలో  ఎక్కడ ఏం జరిగినా కూడా ఇట్టే సోషల్ మీడియాలో వాలిపోతుంది. దీంతో కూర్చున్న చోటు నుంచే ప్రపంచాన్ని మొత్తం చుట్టేయా గలుగుతున్నాడు మనిషి. అరచేతిలో ఉన్న స్మార్ట్ఫోన్లో ప్రపంచం మొత్తం కళ్ళ ముందు వాలిపోతూ ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే వెలుగులోకి వచ్చే కొన్ని ఆసక్తికర ఘటనల గురించి తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు. సాధారణంగా సినిమాల్లో కొన్ని కొన్ని సన్నివేశాలు చూసినప్పుడు ఇలాంటివి నిజ జీవితంలో జరగడం అసాధ్యమని ప్రతి ఒక్కరికి అనిపిస్తూ ఉంటుంది.


 కానీ అచ్చం సినిమాల్లోని కొన్ని సన్నివేశాలకు తగ్గట్లుగానే రియల్ లైఫ్ లో కూడా కొన్ని ఆసక్తికర ఘటన జరుగుతూ ఉంటాయి అని చెప్పాలి. ఇప్పుడు జరిగిన ఘటన కూడా ఇలాంటి కోవలోకి చెందినదే. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తమన్నా హీరోయిన్గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఊసరవెల్లి సినిమా గురించి తెలుగు ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది. అయితే ఈ సినిమా పెద్దగా ఆడకపోయినప్పటికీ ఈ సినిమాలో తమన్నా జూనియర్ ఎన్టీఆర్ కెమిస్ట్రీ మాత్రం బాగా వర్క్ అవుట్ అయింది అని చెప్పాలి. అయితే ఈ మూవీలో తమన్నా, జూనియర్ ఎన్టీఆర్ మొదటి పరిచయం కాస్త వింతగా జరుగుతుంది.


 తమన్నాను, తారక్ ను  తీవ్రవాదులు కిడ్నాప్ చేస్తారు  అయితే ఎలాగూ చనిపోతున్నామని భావించి వారు లిప్ కిస్ పెట్టుకున్న తర్వాత.. ఆర్మీ ఎంట్రీ తో వారు బతుకుతారు. అయితే ఇలాంటి ఘటనే ఇజ్రాయిల్ - హమాస్ యుద్ధంలో జరిగింది. మ్యూజిక్ ఫెస్టివల్ పై మిలిటెంట్లు దాడి చేయగా ఇద్దరు ప్రేమికులు ఒక చోటు దాక్కున్నారు. అయితే చావు తప్పదని భావించి ముద్దు పెట్టుకుంటూ సెల్ఫీ తీసుకున్నారు. కానీ ఆ తర్వాత వాళ్లు రక్షించబడ్డారు. అయితే ఈ సెల్ఫీ కి సంబంధించిన ఫోటో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

War