తెలంగాణ‌లో ప్ర‌స్తుత స‌చివాల‌యం కూల్చివేత‌, నూత‌న స‌చివాల‌యం నిర్మాణం నేప‌థ్యంలో...ఆస‌క్తిక‌ర‌మైన ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విధులు చేప‌ట్టే బీఆర్కే భవన్‌లోకి ఇంకా పూర్తి త‌ర‌లింపు కాని నేప‌థ్యంలో...కొత్త అవ‌కాశాలు క‌ల్పిస్తోంది. సెక్రటేరియెట్​ షిఫ్టింగ్​, బీఆర్​కే భవన్​ మరమ్మతులు జరుగుతుండడంతో కొందరు ఉన్నతాధికారులు ఇంటి దగ్గర్నుంచే పని చేయనున్నారు. ఆర్థిక శాఖ, మున్సిపల్​, పంచాయతీరాజ్​, నీటిపారుదల, రెవెన్యూ, ఎక్సైజ్​ తదితర శాఖల ముఖ్య కార్యదర్శుల పనులకు ఆటంకం కలగకుండా సీఎస్​ ఎస్​కే జోషి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇంటి నుంచే పనిచేయాల్సిందిగా ఇప్పటికే ఆయా శాఖల ఉన్నతాధికారులకూ సీఎస్​ సూచించారు.


వరుస సెలవులతో సెక్రటేరియెట్​ షిఫ్టింగ్​ పనుల్లో వేగం కాస్త తగ్గింది. శనివారం జీఏడీలోని పలు ఫైళ్లు, ఫర్నీచర్​ను సర్దిపెట్టారు. ఎక్కువ సామాను ఉండడంతో జీఏడీ, సీఎస్​ పేషీల షిఫ్టింగ్​కు ఇంకొంత సమయం పడుతుందని అంటున్నారు. బీఆర్​కే భవన్​కు రిపేర్లు పూర్తి చేసేందుకు వారం నుంచి పది రోజులు పట్టే అవకాశముంది. ఇప్పుడు పెయింటింగ్​తో పాటు వివిధ శాఖల క్యాబిన్లలో ఫ్యాన్లు, లైట్లు పెడుతున్నారు. సెక్రటేరియెట్​, బీఆర్​కే భవన్​లో డ్యూటీ చేయలేని కారణంగా వర్క్​ ఫ్రం హోం నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. సీఎస్​ జోషి కూడా కొన్ని రోజలు కుందన్​బాగ్​లోని ఇంటి నుంచే పనిచేసేందుకు నిర్ణయించినట్టు తెలుస్తోంది. అక్కడి నుంచే సమీక్షలు చేయనున్నారు. 


మ‌రోవైపు బీఆర్‌కే భవన్​ ఎంట్రెన్స్​ దగ్గర స్కానర్లు ఏర్పాటు చేసేందుకు పోలీసు అధికారులు సిద్ధమవుతున్నారు. అన్ని మరమ్మతులు పూర్తయిన తర్వాతే టెలిఫోన్​, ఇంటర్నెట్​, సీసీ కెమెరాలు, కమాండ్​ కంట్రోల్​ ​రూమ్​, ఇంటర్​కామ్​, డేటా సెంటర్​, సర్వర్​ రూంలు ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. వచ్చే నెల నుంచి బీఆర్​కే భవన్​లో పూర్తి స్థాయిలో పాలన సాగుతుందని తెలుస్తోంది. ఇదిలాఉండ‌గా, ఇప్పటికే భవనాన్ని పరిశీలించిన పోలీసులు.. ట్రాఫిక్​ మళ్లింపులు, ఆంక్షలు, బారికేడ్ల ఏర్పాటు, రోడ్ల మూసివేత, బందోబస్తు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: