నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న మోసాలు చూస్తూ ఉంటే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది అన్న విషయం తెలిసిందే. ఎంతో నమ్మకస్తుడిగా ఉన్నవారే చివరికి మోసాలకు పాల్పడుతూ భారీగా డబ్బులు దండుకుని ఇక ఆ తర్వాత ఎక్కడా దొరక కుండా తిరుగుతున్న ఘటనలు ఎన్నో తన మీదకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక వ్యక్తి ఎన్నో రోజుల నుంచి పెళ్లి సంబంధాలు చూస్తూ ఉన్నప్పటికీ పెళ్ళి జరగడం లేదు అని బాధ పడుతున్న సమయంలో ఇక స్నేహితుడువచ్చి పెళ్లి సంబంధం చూస్తాను అంటూ హామీ ఇచ్చాడు.
 


 ఇక స్నేహితుడు సహాయం చేయడానికి వచ్చాడు అని ఎంతో సంతోష పడిపోయాడు సదరు వ్యక్తి. ఈ క్రమంలోనే ఒక పిల్లను చూసి పెళ్లి కూడా చేయించాడు కానీ పెళ్లి తర్వాత అసలు ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.  స్నేహితుడు పెళ్లి చేయించింది ఒక అమ్మాయితో కాదు హిజ్రా తో అన్నది తెలిసింది అంతే కాదు హిజ్రా తో కలిసి నాటకమాడి లక్షల రూపాయల నగదు పూర్తిగా నగలు కూడా ఎత్తుకెళ్లి నట్లు తెలిసి ఏకంగా అవాక్కయ్యాడు సదరు వ్యక్తి. ఈ ఘటన బీహార్లో వెలుగులోకి వచ్చింది. శివ్ నరైన్ అనే వ్యక్తికి కైలాష్ నాథ్ అనే స్నేహితుడు ఒక అమ్మాయిని చూసి పెళ్ళి చేశాడు. ఈ క్రమంలోనే ఇక పెళ్లి తర్వాత ఆ అమ్మాయిని తీసుకొని స్వగ్రామానికి బయలుదేరుతున్న సమయంలో అతనికి చేదు అనుభవం ఎదురైంది.



 తాను పెళ్లి చేసుకుంది ఒక అమ్మాయిని కాదని హిజ్రా అన్న విషయం బయటపడింది. అంతేకాదు ఇక ఆ హిజ్రా నగదు నగలతో పూర్తిగా కూడా ఉడయించినట్లు తెలుస్తుంది. ఇక ఆ తర్వాత మరో విషయం కూడా అతనికి అర్థమైంది. ఇక ఒక హిజ్రా ను అమ్మాయి గా పరిచయం చేసి పెళ్లి చేయించి అసలు నాటకం ఆడిన సూత్రధారి పాత్రధారి తన స్నేహితుడు అని అర్థం చేసుకున్నాడు సదరు వ్యక్తి. దీంతో కైలాసనాద్ తనను మోసం చేశాడు అన్న కోపంతో చివరికి దారుణంగా కైలాష్ నాథ్ ను చంపేశాడు.  దీంతో పెళ్లి చేసుకొని ఆనందంగా ఉండాలి అనుకున్న నరైన్ చివరికి కటకటాలపాలయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: