ఇదే దారిలో వెళ్తే తనను కూడా మళ్ళీ ముఖ్యమంత్రి పదవిలో కూర్చోవచ్చు అని అనుకున్నారు చంద్రబాబు నాయుడు. ఐదు రూపాయలకే టిఫిను ఆంధ్రప్రదేశ్ లో అందించే స్కీము మొదలు పెట్టారు. కానీ దీని కోసం ఎన్నో బిల్డింగులను తెరిచి భోజనాలు పైన పెట్టాల్సిన ఖర్చు మొత్తాన్ని తీసుకెళ్ళి ఆ బిల్డింగులు అందంగా తీర్చిదిద్దడం కోసం కోట్ల రూపాయలు వెచ్చించారు అని ఇది అసలు ఏమాత్రం క్షమించ దగ్గర నేరం కాదు అని వాపోతున్నారు.
కానీ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఎన్నిక అయిన తరువాత దీనిని పూర్తిగా రద్దు చేశారు. దీనికి మొత్తంగా అయిన ఖర్చు ఏంటా అని బయటకు తీస్తే దాదాపు 53 కోట్లకు పైగా కేవలం బిల్డింగులు కట్టించడానికి ఉపయోగించారు అని తెలుసుకున్నారు. ఇది నడిచిన రోజుల్లో కూడా ప్రజల నుంచి విముకత ఏర్పడిన విషయం మనకి తెలిసినదే.
ఈ కేసు విచారణ కోర్టులో నడుస్తుండగా దీనికి కారణం అయిన వ్యక్తుల అందరిని కూడా కోర్టుకు లాగాలి అనే వాళ్ళని తప్పకుండా శిక్షించాలి అని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇందులో ప్రముఖ ఆరోపణ చంద్రబాబునాయుడే కావడం విశేషం. ఈ కేసులో రేపటి నుంచి ఎన్ని మలుపులు తిరుగుతాయో మనం చూడాల్సి ఉంది.