హైదరాబాద్ మహానంగరంలో రోజు రోజుకు ట్రాఫిక్ సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ ట్రాఫిక్ సమస్యల నుంచి బయటపడేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఎన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నా ట్రాఫిక్ మాత్రం తగ్గడం లేదు. తగ్గకగా విపరీతంగా పెరిగిపోతున్నది. ముఖ్యంగా బంజారాహిల్స్, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ ఏరియాల్లో ట్రాఫిక్ పెరిగిపోతున్నది. ఈ ట్రాఫిక్ ను తగ్గించేందుకు ఇన్నర్ గా వంతెనలు నిర్మిస్తున్నారు.
అయితే, ఈ వంతెనలు మాములుగా వాటిలా ఉంటె పెద్దగా ఉపయోగం ఉండదు. అందుకే పర్యాటకంగా కూడా ఈ వంతెనను ఆధారంగా చేసుకొని నిర్మించాలని ప్లాన్ చేశారు. ఇందులో భాగంగానే దుర్గం చెరువుపై వంతెనను నిర్మిస్తున్నారు. రోడ్ నెంబర్ 45 నుంచి.. ఇనార్బిట్ మాల్ వరకు ఈ వంతెన నిర్మాణం జరుగుతున్నది. రోప్ వే ఆధారంగా వంతెనను నిర్మిస్తున్నారు.
ఎల్ అండ్ టి సంస్థ ఈ వంతెనను నిర్మిస్తోంది. బలమైన రోప్ వే ఆధారంగా దీనిని నిర్మిస్తోంది. ఇప్పటికే చాలా వరకు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. దుర్గం చెరువు చుట్టూ గ్రీనరీ ఏర్పాటు చేస్తూ పర్యాటకాన్ని పెంచుతున్నది. ఈ రోప్ వే నిర్మించడం వలన పర్యాటకంగా కూడా అభివృద్ధి చేసినట్టు అవుతుంది. అందుకోసమే ఈ నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తోంది
తెలంగాణ ప్రభుత్వం.
ఈ నిర్మాణాన్ని త్వరలోనే ఓపెన్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను
కేటీఆర్ ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేశారు. ఆసియాలోనే రెండో అతిపెద్ద రోప్ వంతెన ఇదే కావడం విశేషం. ఈ వంతెన అందుబాటులోకి వస్తే, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ ఏరియాల్లో ట్రాఫిక్ కొంతవరకు తగ్గుతుంది. పర్యావరణం పరంగా కూడా దుర్గం చెరువును అద్భుతంగా తీర్చి దిద్దుతున్నారు. ఆహ్లదకరంగా ఉండటంతో పాటుగా అన్ని రకాలుగా
హైదరాబాద్ ను అభివృద్ధి చేస్తున్నది ప్రభుత్వం. త్వరలోనే ఈ వంతెనను ఓపెన్ చేస్తారట.