కరోనా మహమ్మారి ఎంతగా మనుషులను బాధిస్తుంది అనేది వర్ణనాతీతం.. మనుషుల ప్రాణాలను తీసేందుకు రోజు రోజుకు ఉగ్రరూపం దాల్చుతుంది.. కరోనా లక్షణాలతో లక్షల సంఖ్యలో జనాలు ఆసుపత్రులకు వస్తున్నారు. లక్షల సంఖ్యలో కరోనా తో మరణిస్తున్నారు. రికవరీ అనే మాట ఇప్పుడు దేశం లో ఎక్కడా వినిపించలేదు. కరోనా వచ్చిందంటే జీవితం మీద ఆశలను వదులుకోవాల్సిందే.. బంధాలను, బందుత్వాలను పక్కన పెట్టాల్సిందే.. లేకుంటే మన ప్రాణాలు పోతాయి అనే ధోరణిలో మనుషులు ఉన్నారు.


కుటుంబంలోని వారికి ప్రాణాలు పోయినా కూడా పట్టించుకోవడం లేదు. కనీసం చివరి చూపులకు కూడా రావడం లేదు. ఆసుపత్రి సిబ్బందినే అనాధ శవంలా ఖననం చేస్తున్నారు..ఇలాంటి హృదయ విధారక ఘటనలు దేశ వ్యాప్తంగా వెలుగు చూస్తున్నాయి.. ఇలాంటి వాటి నుంచి ప్రజలను బయటకు తీసుకురావాలని ఓ వ్యక్తి కరోనా రోగికి ముద్దు పెట్టుకున్నాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. మీరు విన్నది నిజమే.. కరోనా తో మరణించిన వ్యక్తికి ముద్దు పెట్టాడు. విషయానికొస్తే.. ప్రజల్లో అపోహలు తొలగించి, వారిలో స్థైర్యం నింపేందుకు ఖమ్మంలోని అన్నం ఫౌండేషన్‌ వ్వవస్థాపక చైర్మన్‌ డా.అన్నం శ్రీనివాసరావు మరోసారి కొవిడ్‌ మృతదేహాన్ని ముద్దాడారు.


కరోనాతో చనిపోయారనగానే ఆప్తులే మృతదేహాన్ని వదిలేసి ఆమడ దూరం పారిపోతున్న సమయంలో.. అలాంటి మృతదేహాల ద్వారా వైరస్‌ వ్యాప్తి చెందదని నిరూపించేందుకే ఆయన ఈ చుంబనం చేశారు. అక్కడ ఉన్న వాళ్లంతా ఈయనకు ఏమైనా పిచ్చి పట్టిందా అని అంటున్నా కూడా అతను ఖాతరు చేయకుండా ఇలా చేయడం ఒకింత షాక్ ఇస్తున్న..అతని ధైర్యానికి అందరూ ఫిదా అవుతున్నారు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.. ఆ వీడియో పై నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు పెడుతున్నారు.. ఇంతకీ ఆయనకు కరోనా వచ్చిందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా కూడా కరోనా తో జర జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది..

మరింత సమాచారం తెలుసుకోండి: