టాలీవుడ్ హీరో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించకుండా ఎక్కువగా కౌంటర్లు వేస్తూ ఉంటుంది హీరోయిన్ పూనమ్ కౌర్.. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పైన ఎక్కువగా తరచూ వినిపిస్తున్న వార్తలు ఏమిటంటే.. మాటమీద నిలబడే వ్యక్తి కాదని.. డబ్బుకి అమ్ముడుపోయారని.. మూడు పెళ్లిళ్లనే.. ఇతరత్రా వార్తలు వినిపిస్తూ ఉంటాయి..అయితే ఇప్పుడు తాజాగా వైసీపీ నేత ఒకరికి మూడు పెళ్లిళ్ల వ్యవహారంలో కౌంటర్ ఇవ్వడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వాస్తవానికి పూనమ్ కౌర్ ,పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ మధ్య ఏదో జరిగిందనే విషయం పైన ఇప్పటివరకు ఎక్కడ క్లారిటీ రాలేదు.


కానీ ఈ విషయం మీద మాత్రం ఎన్నో ప్రచారాలు అయితే ఇప్పటికీ వినిపిస్తూ ఉంటాయి. పూనమ్ కౌర్ కూడా ఎన్నో సందర్భాలలో పవన్, త్రివిక్రమ్ పేర్లను తీసుకువచ్చి.. మరి కొన్నిసార్లు తీయకుండా విమర్శలు సైతం కురిపిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు మాత్రం ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఓ వైసిపి నేత ఆమె టార్గెట్ అన్నట్టుగా వ్యవహరిస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే ప్రదీప్ రెడ్డి చింత అనే ఒక ఎన్నారై వైసీపీ నేత గత కొంతకాలంగా సోషల్ మీడియాలో తరచు యాక్టివ్గానే కనిపిస్తున్నారు..



జనసేన పవన్ కళ్యాణ్ సహా టిడిపి నేతలు మీద ఎక్కువగా విమర్శలు చేస్తూ ఉంటారు.. తాజాగా ఆయన టెస్టులా కంపెనీ ఓనర్ ఎలా మాస్కుని సోషల్ మీడియాలో ట్యాగ్ చేసి తాను వాడేది టెస్లా కారని.. తన ట్విట్టర్లో యాక్టివ్ గా ఉంటానని ఈ విషయాలను కన్సిడర్ చేసి ఆంధ్రప్రదేశ్ కు టెస్టుల షాప్ పెట్టాలని కోరడం జరిగింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెస్లా కంపెనీకి ఆహ్వానించిన వార్తను కూడా షేర్ చేశారు. అయితే ఇప్పుడు ఇదే ట్వీట్ ను రీ ట్వీట్ చేస్తు పూనమ్ ఆయనకు కూడా మూడు పెళ్లిళ్లు అయ్యాయి. అయినా పర్వాలేదా అంటూ ఆ వైసిపి నేతకి కౌంటర్ ఇచ్చింది. గతంలో పవన్ కళ్యాణ్ మీద కౌంటర్ వేస్తూ ఉండే పూనమ్ ఇప్పుడు వైసీపీ నేతలకు కౌంటర్ ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: