
పొరుగుదేశం పాకిస్తానీయుడిని చూడండి, వాడు ఏ ఖండం వెళ్ళినా తన దేశభక్తిని, తన మత విశ్వాసాల్ని గుండెల్లో పెట్టుకుంటాడు. వాడికి ఆ మత పిచ్చి, దేశ పిచ్చి అణువణువునా జీర్ణించుకుపోయి ఉంటాయి. ఇతర ఇస్లామిక్ దేశాల వారైనా, క్రైస్తవ దేశాల వారైనా తమ తమ మూలాలను అంత తేలిగ్గా వదులుకోరు. వాళ్ల జెండా ఎక్కడైనా రెపరెపలాడాల్సిందే.
కానీ, మన హిందువుల్లో కొందరు మాత్రం 'మేము చాలా సెక్యులర్లం సుమా' అని లోకానికి చాటుకోవడం కోసం, మన సంప్రదాయాలను, మన జాతి గౌరవాన్ని పక్కనపెట్టి, పరాయి సిద్ధాంతాలకు వంత పాడతారు. ఇది చాలదన్నట్టు, సొంత జాతి పునాదులనే పెకిలించే కుట్రలకు తెరలేపుతున్నారు. దీనికి సజీవ సాక్ష్యాలు కావాలంటే కెనడా, ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో స్థిరపడిన మన సిక్కు సోదరుల్లో కొందరి ప్రవర్తనే నిదర్శనం.
అక్కడికెళ్లి, మన పక్కలో బల్లెంలాంటి పాకిస్తాన్ ఏజెంట్లతో చేతులు కలిపి, భారతదేశంపై విషం చిమ్మే కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. అక్కడి అమాయక హిందూ సమాజంపై దాడులకు, హిందూ దేవాలయాల ధ్వంసానికి ఉసిగొల్పుతూ, ఖలిస్తానీ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ హిందూ జాతిని సమూలంగా నాశనం చేయాలనే భయంకరమైన కుట్రలు పన్నుతున్నారు.
ఇది ఒక ఎత్తయితే, మన మలయాళీ సోదరుల తీరు మరో వింత. స్వయంగా మన దేశంలోని కేరళలో పురుడు పోసుకున్న 'వరల్డ్ మలయాళీ కౌన్సిల్' అనే సంస్థ, ఇప్పుడు ఏకంగా అజర్బైజాన్లో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి నడుం బిగించిందట. అజర్బైజాన్ ఎవరికి మిత్రదేశమో, ఎవరితో సఖ్యంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాకిస్తాన్తో అంటకాగుతూ, ఆ దేశ పర్యాటకాన్ని మనవాళ్లే అభివృద్ధి చేస్తామనడం ఎంతవరకు సమంజసం? దీని వెనుక పాకిస్తాన్తో రహస్య ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలు ఉన్నాయనేది విశ్లేషకుల వాదన.
ఇలాంటి పరిణామాలు చూస్తుంటే, మన దేశం ఎంతటి దౌర్భాగ్య స్థితిలో ఉందో అర్థమవుతోంది. మనవాళ్లే మనకు శత్రువులుగా మారుతున్న ఈ విపత్కర పరిస్థితులు దేశ భవిష్యత్తుకు ఏమాత్రం శ్రేయస్కరం కాదు. సొంత ప్రయోజనాల కోసం, విదేశీ శక్తుల ప్రలోభాలకు లొంగి, కన్నతల్లి లాంటి దేశానికి ద్రోహం తలపెట్టడం క్షమించరాని నేరం.