
పురుషోత్తమట్నం అనే గ్రామం కూడా ఏపీ పరిధిలోకి ఉన్న.. భౌగోళికంగా ఈ గ్రామం తెలంగాణలో ఉన్న సాంకేతికంగా మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికే చెందినది. దీనివల్ల ఈ భూములు కబ్జాకు గురవుతున్నారని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది .అయినా కూడా అధికారులు ఏమీ చేయలేకపోతున్నారు. అయితే విభజన చట్ట ప్రకారం తెలంగాణలో ఐదు గ్రామాలు ఏపీలో కలిసిపోయాయి. దీనివల్ల తిరిగి మళ్లీ ఏపీలో నుంచి తెలంగాణలోకి ఈ గ్రామాలను తీసుకురావాలని డిమాండ్ కూడా పెరిగిపోయింది. ఈ ఐదు గ్రామాలలో పురుషోత్తమట్నం కలదు.
ఈ కబ్జా చేసిన భూములలో కొంతమంది నిర్మాణాలు చేపడుతున్నారని అక్కడ ఉండే దేవాలయ అధికారులకు కూడా కొంతమంది స్థానికులు సమాచారం ఇవ్వగా తమ సిబ్బందితో ఈవో రమాదేవి వెంటనే ఆ గ్రామానికి వెళ్లి అక్కడ నిర్మాణ పనులను గమనించి కబ్జాదారులను అడ్డుకున్నారు. దీంతో కబ్జాదారులకు ఈవో రమాదేవి కి మధ్య తోపులాట జరిగింది.. ఈ తోపులాటలో భాగంగానే ఈవో రమాదేవి కింద పడిపోవడంతో స్పృహ తప్పి పడిపోయారట. ఈ విషయాన్ని గమనించిన సిబ్బంది వెంటనే ఆయన ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది.