జనసైనికుల్లో అసంతృప్తి .. పవన్ పదే పదే "కలిసి నడుదాం" అంటున్నా, జనసైనికుల్లో మాత్రం అసహనం పెరుగుతోంది. ఎందుకంటే కూటమి వ్యవహారాల్లో జనసేనకు వచ్చే ప్రాధాన్యతేంటి? అసలు నాయకత్వంలో వారికున్న స్థానం ఏంటి? అని కింది క్యాడర్ ప్రశ్నిస్తోంది. నియోజకవర్గ స్థాయిలో జరుగుతున్న అంతర్గత గొడవలు, అభిప్రాయ భిన్నతలు... ఇవన్నీ కూటమి ఐక్యతను ప్రశ్నించేవే! ఐక్యంగా ఉంటే గెలుపేనా? .. పవన్ కల్యాణ్ చెబుతున్న పదిహేనేళ్ల ఐక్యత గెలుపు గ్యారంటీనా? రాజకీయాల లెక్కల్లో వన్ + వన్ = 2 అనిపించదు. అదే ఉత్తరప్రదేశ్లో 2022లో జరిగినదాన్ని చూసినా స్పష్టమవుతుంది. ఎన్నో పార్టీలు కలిసి పోటీ చేసినా ప్రజలు ఓ వైపు ఫోకస్ పెట్టకపోతే ఓటమి తప్పదు. కూటమి ఓటుకు మినహాయింపు లేదు, "మూడ్ ఆఫ్ ది నేషన్" ఫైనల్ తీర్పును ఇస్తుంది.
వైసీపీ వ్యూహాలపై పవన్ విశ్వాసం .. ఇంకా పవన్ విమర్శల టార్గెట్ వైసీపీయే. కానీ ఆ పార్టీ 2024లో భీకరంగా ఓడిపోయిన నేపథ్యంలో... ఇప్పుడు కూడా అదే స్టైల్లో విమర్శలు చేయడం, రొటీన్ రాజకీయంగా మిగిలిపోతోంది. జనంలో కొత్తగా రియాక్షన్ రాకపోవడం చూస్తే, పవన్ కొత్త యాంగిల్స్ ప్రయత్నించాల్సిన అవసరం ఉంది. అంతర్మధనంలో జనసేన క్యాడర్ .. తమ పార్టీ క్యాడర్కు సముచిత గౌరవం ఇవ్వకపోతే ఐక్యత బలపడదని అంటున్నారు. కూటమి సరే కానీ, జనసేనకు గౌరవం, ప్రాధాన్యం ఉంటేనే అది నిజమైన ఐక్యత అంటున్నారు కార్యకర్తలు. ఇదే పవన్ గమనించాల్సిన ముఖ్యాంశం. పవన్ కల్యాణ్ 15 ఏళ్ల ఐక్యత లెక్కలు పెట్టినా, గ్రౌండ్ రియాలిటీ మాత్రం వేరే పాట పడుతోంది. నిజంగా జనంలో నమ్మకం గెలవాలంటే, కూటమిలోని పాత్ర స్పష్టంగా ఉండాలి. లేకపోతే ఈ మాటలు భవిష్యత్లో తలనొప్పిగా మారే అవకాశం ఉంది. రాజకీయాల్లో ఐక్యత మాటలతో కాదు – స్థానాలతో, గౌరవంతో సాగాలి!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి