ఇటీవల రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్లో ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మూడు పరుగుల తేడాతో ఓడిపోయింది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఓటమిని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు అభిమానులు. మహేంద్ర సింగ్ ధోని చివరిలో 17 బంతుల్లో 32 పరుగులు చేసి ఆకట్టుకున్నప్పటికీ ఇక జట్టు మూడు పరుగులు చేయలేక చివరికి ఓటమి చవిచూడాల్సిన పరిస్థితి వచ్చింది. చివరి ఓవర్ లో 21 పరుగులు చేయాల్సి ఉండగా ధోని 18 పరుగులు మాత్రమే చేయగలిగాడు అని చెప్పాలి.



 ఇకపోతే ఈ టోర్నమెంట్లో ధోని సేన నాలుగు మ్యాచ్లలో రెండింటిలో గెలిచి పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో కొనసాగుతుంది అని చెప్పాలి. అయితే చెన్నై సూపర్ కింగ్స్ ఓటములకు ఆ జట్టులో ఉన్న ఇద్దరు ప్లేయర్లే కారణం అవుతున్నారు అనేది తెలుస్తుంది. పదేపదే చెత్త ప్రదర్శనతో ఇక జట్టుకు భారంగా మారిపోతున్నారు. ఇక వారిద్దరే జట్టులో విలన్లు అనేది తెలుస్తుంది. అయితే వీరిని మహేంద్రసింగ్ ధోని మోసపోయాడు అన్నది మాత్రం అర్థం అవుతుంది. ఆ ఆ ఇద్దరు క్రికెటర్లు ఎవరో కాదు అంబటి రాయుడు, శివం దుబే. అంబటి  రాయుడు ఇప్పుడు వరకు జరిగిన నాలుగు మ్యాచ్లో కలిపి కేవలం 60 పరుగులు మాత్రమే చేయగలిగాడు.



 నెంబర్ ఐదు లో బ్యాటింగ్ చేయడానికి వస్తున్న రాయుడు ఒక్కసారి మాత్రమే పరవాలేదు అనిపించాడు. మిగతా మూడు మ్యాచ్లలో కూడా అతని బ్యాట్ నుంచి పరుగులే రాలేదు. ఇక మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తూ స్ట్రైక్ రొటేట్ చేయకపోవడం కూడా చెన్నై ఓటమికి కారణం అవుతుంది అని చెప్పాలి. జట్టులో ఆల్ రౌండర్ పాత్రలో ఉన్న శివం దూబే ఇప్పటివరకు ఒక్క సందర్భంలో బౌలింగ్ వేయలేదు. బ్యాటింగ్లో కూడా పెద్దగా ఆకట్టుకున్నది లేదు. నాలుగు మ్యాచ్లలో కలిపి 22 పరుగులు మాత్రమే చేసాడు శివం దూబే. ఈ సీజన్లో అతని అత్యుత్తమ స్కోర్ 28 మాత్రమే కావడం గమనార్హం. ఈ ఇద్దరు   చెన్నై జట్టులో విలన్ లుగా మారారని వీరిని నమ్మి ధోని మోసపోయాడు అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl