గత రెండో రోజుల నుండి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తుంది. సోషల్ మీడియాకు సంబంధించిన తన అన్ని అకౌంట్ల లో ప్రొఫైల్ పిక్ తో పాటు కవర్ ఫోటో ను తీసేసింది. దాంతో ఆర్సీబీ కొత్త లోగో తో పాటు జట్టు పేరును మార్చనుందని వార్తలు వచ్చాయి. ఆర్సీబీ కూడా రేపు సప్రైజ్ ఇవ్వనున్నట్లు నిన్న ప్రకటించగా..  ఈరోజు  కొత్త లోగోను  విడుదలచేసింది.
 
కీరిటాన్ని ధరించిన సింహాన్ని ఆర్సీబీ లోగో గా పెట్టుకోగా జట్టు పేరును మాత్రం మార్చలేదు. అయితే ఇక్కడి తో అయిపోలేదని రానున్న రోజుల్లో మరికొన్ని అప్డేట్స్ కూడా రానున్నాయని ఆర్సీబీ ప్రకటించగా.. కొంపదీసి సైని, ఉమేష్ యాదవ్ ను ఓపెనర్లు గా ప్రమోట్ చేస్తారా అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఇక లోగో తోపాటు ఆర్సీబీ జెర్సీ కూడా మారనుంది. కొత్త  స్పాన్సర్స్ పేర్ల తో మరింత కలర్ ఫుల్ గా జెర్సీ వుండనుందట కాగా ముత్తూట్ ఫైనాన్స్ ,ఆజట్టు ప్రధాన స్పాన్సర్ గా వ్యవహరించనుంది. 
 
ఇక ప్రతి సీజన్ లో ఫేవరేట్ టీంగా బరిలోకి దిగుతున్న కూడా ఆర్సీబీ ఇంతవరకు ఒక్కసారి కూడా ట్రోఫీ ని గెలుచుకోలేకపోయింది. మరి కొత్త లోగో, కొత్త జెర్సీ తోనైనా ఆజట్టుకు అదృష్టం కలిసివస్తుందో చూడాలి. ఐపీఎల్ 13వ సీజన్  మార్చి 29న  ప్రారంభమై మే 24తో ముగియనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: