యూనివర్సల్ బాస్ వెస్టిండీస్ మాజీ క్రికెటర్ క్రిస్ గేల్ 2010లో ప్రపంచ కప్ లో వెస్టిండీస్ కెప్టెన్ గా వ్యవహరించాడు. ఈ సమయంలో 66 బంతుల్లో 98 పరుగులు చేయగా ఈ మెగా టోర్నీలో కెప్టెన్ గా ఇదే అత్యధిక స్కోర్. ఇప్పుడు రోహిత్ శర్మ ఈ అరుదైన రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది అని చెప్పాలి.
అయితే ఇప్పటివరకు టి20 వరల్డ్ కప్ లో శ్రీలంక లెజెండరీ బ్యాట్స్మెన్ మహేళా జయవర్ధనె అత్యధిక పరుగులు సాధించిన వీరుడుగా కొనసాగుతున్నాడు. మొత్తంగా టి20 వరల్డ్ కపులో కలిపి ఒక 1016 పరుగులు సాధించాడు. జయవర్ధన్ తర్వాత క్రిస్ గేల్ 965,, తిలకరత్నే దిల్షాన్ 897, రోహిత్ శర్మ 847 పరుగులు సాధించి వరుసగా ఈ లిస్టులో ఉన్నారు. కాగా ఈ టి20 వరల్డ్ కప్లో 169 పరుగులు సాధిస్తే అత్యధిక పరుగులు సాధించిన వీరుడుగా రికార్డు సృష్టిస్తాడు.
కాగా 2007లో టీమిండియా తరఫున తొలి టి20 మ్యాచ్ ఆడాడు రోహిత్ శర్మ. ఇప్పుడు వరకు 33 మ్యాచ్ లు ఆడాడు. అయితే మరో మూడు మ్యాచ్లు పూర్తి చేసుకున్నాడు అంటే ప్రపంచకప్ తో అత్యధిక మ్యాచ్ లు ఆడిన క్రికెటర్గా నిలుస్తాడు. ధోని క్రిస్ గేల్ పేరిట ఉన్న 35 మ్యాచ్ల రికార్డును బద్దలు కొడతాడు.
ఇప్పటివరకు ఐసీసీ టోర్నీలో 31 సిక్సర్లు కొట్టిన హిట్ మ్యాన్ ఒక అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు అని చెప్పాలి. మరో మూడు సిక్సర్లు కొట్టాడు అంటే చాలు ఈ మెగా ఈవెంట్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రికార్డ్ సృష్టిస్తాడు మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ పేరిట ఉన్న 33 సిక్సర్ల రికార్డును బద్దలు కొడతాడు.