ఈ కొత్త సంవత్సరంలో మన ఇంట్లో వాడే వస్తువులు టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్ లాంటి వస్తువుల రేట్లు అమాంతం పెరిగిపోతున్నాయట. దాంతో సోషల్ మీడియా మాధ్యమాల్లో ఓ వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. కొత్తేడాదిలో టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు.. ఇలా ఏదో ఒకటి కొనుగోలు చేయాలని చాలా మంది ఆలోచిస్తుంటారు. అలాంటి వారు ఈ రెండు మూడు రోజులు చేస్తే మంచిది కొత్త ఏడాదిలో రేట్లు ఒక్కసారి గా పెరిగిపోతున్నాయని చెప్తున్నారు.. కొత్తేడాదిలో అదో గుర్తుగా మిగిలిపోతుందని బాయించే వారు ఇప్పుడే ఆ వస్తువులను కొనాలని చెపుతున్నారు..
జనవరి 1 నుంచి ఈ వస్తువుల ధరలు ఏకంగా 7 నుంచి 8 శాతం పెరగనున్నాయి. ఈ విషయాన్ని సదరు కపెంనీలే స్వయంగా ప్రకటించాయి. రాగి, అల్యూమినియం, స్టీల్ వంటి ముడిసరుకుల ధరలు విపరీతంగా పెరగడమే ఎలాక్ట్రానిక్ గృహోపకరణాల ధరల పెంపునకు కారణమని కంపెనీలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే గత పదేళ్లలో ఇలా ఒకేసారి ఇంతలా ధరలు పెరిగిన దాఖలాలు లేవని బిజినెస్ నిపుణులు చెబుతున్నారు. కరోనా కారణంగా ఇప్పటికే ఆర్థికంగా దెబ్బతిన్న ప్రజలకు ఈ ధరల పెరుగుదల మరింత భారంగా మారనుందనడంలో ఎలాంటి సందేహం లేదు.