అయితే ఇప్పుడు మరోసారి మోక్షజ్ఞ ఇండస్ట్రీ ఎంట్రీ గురించి వార్తలొస్తున్నాయి. ఈసారి పుకార్లు కాస్త గట్టిగానే వినిపిస్తున్నాయి కూడా. టాలీవుడ్లో వారసుల ఎంట్రీ అంటే గుర్తొచ్చే దర్శకులు వి.వి.వినాయక్, పూరి జగన్నాథ్.మోక్షజ్ఞ ఎంట్రీ విషయంలో ఈ రెండు పేర్లు ఇప్పటివరకు పెద్దగా వినిపించలేదు. తొలుత నుంచి వినిపిస్తూ వచ్చిన పేరు బోయపాటి శ్రీను. ఇప్పటికే సినిమా కథను బాలకృష్ణ విన్నారని, మార్పులు చేర్పులు చెప్పారని కూడా వార్తలొచ్చాయి. చాలా రోజులపాటు ఈ మాటలే వినిపించాయి. అయితే ఇప్పుడు మరో దర్శకుడి పేరు వార్తల్లోకి వచ్చింది. అతనే పూరి జగన్నాథ్. ఈ స్టార్ డైరక్టర్కు బాలయ్య… తన కొడుకు డెబ్యూ అవకాశం ఇస్తున్నాడట. అయితే ఇక్కడో మెలిక ఉందని తెలుస్తోంది.
పూరి ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ‘లైగర్’ తీస్తున్నాడు. పాన్ ఇండియా రేంజీలో రూపొందుతున్నఈ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో విజయ్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమా విజయం చాలా మందికి అవసరం. చాలా రోజులుగా సరైన విజయం లేని విజయ్కి చాలా అవసరం. అలాగే మోక్షజ్ఞ డెబ్యూ అవకాశం దక్కాలంటే పూరికి ఈ విజయం అవసరమని సమాచారం. నందమూరి బాలకృష్ణ ఇప్పటికే పూరితో మోక్షజ్ఞ సినిమా విషయంలో చర్చలు జరిపాడట. రెండు, మూడు కథలను కూడా విన్నట్లు భోగట్టా. ‘లైగర్’ సక్సెస్ అయితే వెంటనే మోక్షజ్ఞ సినిమా షురూ చేస్తారట.కాని నందమూరి అభిమానులు కొంచెం ఖంగారు పడుతున్నారు. ఎందుకంటే మోక్షజ్ఞ పరిస్థితి కూడా అఖిల్ లాగా అవుతుందేమోనని భయపడుతున్నారు. అఖిల్ కూడా ఎన్నో అంచనాలతో ముందుకు వచ్చాడు. మోక్షజ్ఞ కూడా అలా బోల్తా పడతాడేమో అని అభిమానులు భయపడుతున్నారు. చూడాలి మరి మోక్షజ్ఞ బోల్తా పడతాడో లేక పెద్ద స్టార్ హీరో అవుతాడో. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో మూవీ అప్ డేట్స్ గురించి తెలుసుకోండి...