ఎన్టీఆర్, చరణ్ లతో ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్ పై ఆయా హీరోల ఫ్యాన్స్ తో పాటు దేశవిదేశాల్లోని ఆడియన్స్ లో కూడా భారీ స్థాయిలో క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్, బాలీవుడ్ నటి అలియా భట్ హీరోయిన్స్ గా యాక్ట్ చేస్తుండగా సముద్రఖని, శ్రియ, రాహుల్ రామకృష్ణ, అజయ్ దేవగన్ తదితరులు ఇతర పాత్రలు చేస్తున్నారు.

ఎన్టీఆర్ కొమురం భీం గా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా యాక్ట్ చేస్తున్న ఈ సినిమా నుండి ఇటీవల విడుదలైన ఇద్దరు హీరోల టీజర్లు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ దక్కించుకుని సినిమాపై మరింత భారీ హైప్ క్రియేట్ చేసాయి. అత్యంత భారీ వ్యవయంతో, అత్యున్నతంగా నిర్మితం అవుతున్న ఈ సినిమా పేట్రియాటిక్ డ్రామా మూవీ గా పలు యాక్షన్, కమర్షియల్ హంగులతో తెరకెక్కుతోంది. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీకి సెంథిల్ కుమార్ ఫొటోగ్రఫీని అలానే సాయి మాధవ్ బుర్రా మాటలను సమకూరుస్తున్నారు. ఇక అసలు విషయం ఏమిటంటే ఈ సినిమా యొక్క ఆడియో రైట్స్ ని ప్రముఖ సంస్థలు లహరి, టి సిరీస్ వారు ఏకంగా రూ.25 కోట్ల రూపాయలకు దక్కించుకున్నారు. ఇప్పటివరకు ఈ స్థాయిలో ఆడియో రైట్స్ అమ్ముడుపోయిన సినిమా ఇదే కావడం విశేషం.

కొద్దిసేపటి క్రితం ఈ సినిమా ఆడియో రైట్స్ కొనుగోలుకు సంబంధించి అధికారిక ప్రకటన విడుదల చేసిన టి సిరీస్ సంస్థ త్వరలో ఈ మూవీ సాంగ్స్ విడుదల చేస్తామని, తప్పకుండా అన్ని పాటలు శ్రోతలను ఎంతో ఆకట్టుంటాయని వారు అంటున్నారు. ఈ సినిమాకి కీరవాణి అద్భుతమైన సాంగ్స్ తో పాటు అదిరిపోయే రేంజ్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సమకూర్చినట్లు టాక్. కాగా ఈ సినిమా అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే ..... !!  




మరింత సమాచారం తెలుసుకోండి: