తెలుగు సినిమా ఇండస్ట్రీలో అందాల తార సౌందర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందంతో ఎంతోమంది ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక తన చక్కటి సాంప్రదాయ చీరకట్టుతో ప్రతి ఒక్క ప్రేక్షకులను అచ్చ తెలుగు అమ్మాయి అనేలా ఆకట్టుకుంది. ఇక సౌందర్య మరణించినప్పుడు సినీ పరిశ్రమ కాదు ఆమె అభిమానుల సైతం ఎంతోమంది కన్నీరు పెట్టుకున్నారు చలనచిత్ర పరిశ్రమలో ఆమె కంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది సౌందర్య.. సావిత్రి గారి తరహాలో పేరు సంపాదించుకున్న ఈమె తన జీవితంలో ఒక తప్పు చేసి ఇప్పుడు వాళ్ల తల్లిదండ్రులను కూడా ఇబ్బంది పడేలా చేసింది సౌందర్య వాటి గురించి తెలుసుకుందాం.


సౌందర్య కెరియర్ లో ఎంతో మంది టాప్ హీరోలతో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించింది దక్షిణాదిలోనే కాకుండా ఇతర భాషలలో కూడా మొత్తం 12 సంవత్సరాల కెరియర్ లో 100కు పైగా సినిమాలలో నటించి అరుదైన రికార్డును దక్కించుకుంది సౌందర్య. కెరియర్ బాగా సాగుతున్న సమయంలోనే తన దగ్గర బంధువైన రఘును ప్రేమించి వివాహం చేసుకుంది వాస్తవానికి ఈ పెళ్లి సౌందర్య తల్లిదండ్రులకు ఇష్టం లేదట కానీ ఆమె బలవంతంగా వారిని ఒప్పించి వివాహం చేసుకుంది.


వివాహమైన తర్వాత కూడా అల్లుడు చేష్టలకి సౌందర్య తల్లిదండ్రులు విసిగిపోయారు అన్నట్లుగా గతంలో వార్తలు వినిపించాయి కానీ అలాంటి సమయంలోనే సౌందర్య మరణ వార్త వారిని మరింత కలవరవేచింది. ఆ తరువాత సౌందర్య ఆస్తులు గురించి పెద్ద చర్చ నడిచిందని చెప్పవచ్చు. ఆమె భర్త రఘు ఒక్క రూపాయి కూడా సౌందర్య తల్లిదండ్రులకు ఇవ్వకుండా మొత్తం తానే అనుభవిస్తున్నాడు అంటే వార్తలు వినిపించాయి.దీంతో ఇప్పటికీ ఈ కేస్ కోర్టులోనే నడుస్తున్నట్లుగా సమాచారం సౌందర్య అతన్ని వివాహం చేసుకోకపోతే తమ పేరెంట్స్ చెప్పినట్లుగా విని ఉంటే ఈనాడు వారి తల్లిదండ్రులకు ఇలాంటి బాధ వచ్చేది కాదు అన్నట్లుగా పలువురు నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: