ముఖ్యంగా శ్రీకృష్ణుడి తత్వం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం అటు బాలీవుడ్ ఆడియన్స్ ని కూడా విపరీతంగా ఆకట్టుకుందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే అతి తక్కువ రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్ లో చేరి అతి కొద్ది మంది దర్శకులలో ఈ ఫీట్ ను అందుకున్నారు దర్శకుడు చందు మొండేటి. ఇకపోతే చిత్రం రూ. 100 కోట్ల దిశగా పయనిస్తోంది అని.. ఇప్పటికే నాన్ థియేట్రికల్ పరంగా రూ.30 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమా రెండు వసూళ్లను బట్టి చూస్తే ఇప్పటికే రూ. 100 కోట్ల క్లబ్లో చేరిపోయింది. దీంతో అటు దర్శకుడికి, ఇటు హీరో నిఖిల్ కి మంచి గుర్తింపు లభించిందని చెప్పవచ్చు. ఈ సినిమా నిఖిల్ సినీ కెరియర్ లోనే ఒక టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి.
రానున్న రోజుల్లో ఈ ఫిగర్ మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు కూడా చెబుతున్నాయి. ఇక బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఇందులో కీలకపాత్రలో నటించడం, శ్రీకృష్ణుడిపై తెరకెక్కిన సినిమా కావడంతో ఈ సినిమాకు దక్షిణాదితో పాటు ఉత్తరాది ప్రేక్షకులు కూడా బ్రహ్మరథం పట్టారు. అందుకే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తూ ఉండడం గమనార్హం.