పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు ఫర్ ది ఫస్ట్ టైం ఓ భారీ బడ్జెట్ పాన్ వరల్డ్ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఇంకా పేరు ఖరారుకాని ఈ చిత్రాన్ని 'SSMB29'గా పిలుస్తున్నారు.అయితే ఈ సినిమాపై రోజుకొక వార్త సంచలనం సృష్టిస్తోంది. నిన్నటి వరకు ఈ భారీ బడ్జెట్‌ చిత్రంలో తమిళ హీరోలు కార్తి ఇంకా విక్రమ్ ఉన్నారంటూ ప్రచారం జరిగింది. ఇక ఈ రోజు ఈ సినిమాకు సంబంధించి మరో వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఈ సినిమా మొదలు కావడానికి ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ అప్పుడే అనేక రకాల గాసిప్స్ అయితే వైరల్ అవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం విలన్ గురించి కొన్ని వార్తలు వైరల్ కాగా ఇప్పుడు హీరోయిన్ గురించి ఒక కొత్త టాక్ వినిపిస్తోంది.బాలీవుడ్‌ ప్రముఖ కథానాయిక దీపికా పదుకొణె ఈ చిత్రంలో కీలకపాత్ర పోషించనున్నారట. చిత్రబృందం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాకపోయిన ఈ వార్త మాత్రం తెగ చక్కర్లు కొడుతోంది.రాజమౌళి త్వరలో ఈమెని సంప్రదిస్తారని సమాచారం తెలుస్తుంది.యాక్షన్‌ ప్రధానంగా రానున్న ఈ సినిమా రాజమౌళి కెరీర్‌లోనే అతి పెద్ద చిత్రంగా నిలవనుంది.


ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా స్థాయిలో కె.ఎల్‌. నారాయణ నిర్మించనున్నారు. ఇంతకుముందు రాజమౌళి తండ్రి కథ రచయిత కె.విజయేంద్ర ప్రసాద్ చెప్పిన దాన్ని బట్టి మహేష్ బాబుతో చేయబోయే సినిమా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతున్నట్లు ఒక క్లారిటీ అయితే వచ్చింది. అలాగే ఇంకా ఓ రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకొని ఈ సినిమా ఉంటుందని అన్నారు.అయితే ఆ తర్వాత మళ్లీ పూర్తిస్థాయిలో ఇంకా కథ సెట్ అవ్వలేదు అని కూడా అనుకున్నారు. ఇక రాజమౌళి అయితే దాదాపు పూర్తిస్థాయిలో స్క్రిప్ట్ అయితే ఫినిష్ చేసే దశకు చేరుకున్నట్లుగా తెలుస్తోంది.మహేష్ విషయానికి వస్తే త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 28 వ సినిమా పనుల్లో బిజీగా వున్నాడు. ఈ సినిమా తరువాత రాజమౌళి సినిమా ఉంటుంది.దీపిక విషయానికి వస్తే ఇక ప్రస్తుతం ప్రభాస్‌ హీరోగా రూపుదిద్దుకుంటోన్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'ప్రాజెక్ట్‌ కె' (వర్కింగ్‌ టైటిల్‌) లో దీపికా నటిస్తోంది. నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: