ప్రముఖ నటి అందాల తార శ్రీదేవి మరణం యావత్ భారత దేశ అభిమానులకు శోక సంద్రంలో ముంచిన విషయం తెలిసిందే. నటిగా ఎన్నో భాషల్లో ఆమెకు మంచి పేరు ఉంది. తన కూతురు జాన్వి కపూర్ హీరోయిన్ గా చూడాలన్న ఆమె కోరిక తీరకుండానే తనువు చాలించారు. బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత స్టార్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ ని వివాహం చేసుకున్న తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టారు. అప్పటి నుంచి సినీ జీవితానికి గుడ్ బాయ్ చెప్పారు శ్రీదేవి.
మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ‘ఇంగ్లీష్- వింగ్లీష్’తో మొదలు పెట్టారు..ఈ సినిమా మంచి పేరు తీసుకు వచ్చింది. తాజాగా ‘ఇంగ్లీష్- వింగ్లీష్’సినిమాలో శ్రీదేవి సోదరిగా నటించిన సుజాతా కుమార్ ఈ రోజు కన్నుమూశారు. గతకొంతకాలంగా ఆమె కేన్సర్తో బాధపడుతూ వచ్చిన ఆమె ఆదివారం రాత్రి చనిపోయారు.
ఈ విషయాన్ని ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కపూ భార్య సుజాత సోదరి సుచిత్రా కృష్ణమూర్తి తన ఫేస్బుక్ అకౌంట్లో... ‘సుజాత ఆగస్టు 19, 2018న రాత్రి 11. 26 నిముషాలకు కన్నుమూశారు. ఇకపై జీవితం మునుపటి మాదిరిగా ఉండదు. ఈరోజు (ఆగస్టు 20) ఉదయం 11 గంటలకు సుజాత అంతిమ సంస్కారాలను ముంబైలోని విలే పార్లేలోగల శ్మశాన వాటికలో నిర్వహిస్తాం’ అని తెలియజేశారు.