బాహుబలి 2 తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తెరపై కనిపించడానికి చాలా సమయం పట్టింది. రాజమౌళి తీసిన బాహుబలి మూవీకోసం ఏకంగా ఐదు సంవత్సరాలు కష్టపడితే.. సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ‘సాహూ’ మూవీ కోసం రెండు సంవత్సరాలు కష్టపడ్డాడు. అయితే బాహుబలి మూవీలో నటించినందుకు ప్రభాస్ కి జాతీయ స్థాయిలో మంచి క్రేజ్ వచ్చింది. ఈ ప్రభావం తన తదుపరి సినిమాలపై కూడా ఉంటుందన్న విషయం దృష్టిలో పెట్టుకొని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి సిద్దంగా ఉన్నారు చిత్ర యూనిట్.
అంతే కాదు ఈ మూవీలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ నటిస్తుంది. మరికొన్ని ముఖ్యపాత్రల్లో బాలీవుడ్ నటులు నటిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన టీజర్ ఇటీవల రిలీజ్ అయ్యింది. లిరికల్ సాంగ్స్ కి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే ప్రభాస్ ‘సాహూ’ పై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో ఆగస్టు 30 కి ఎంతో ప్రాధాన్యత వచ్చింది. నిజానికి ‘సాహో’ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాని కారణంగా విడుదల తేదీని 30కి వాయిదా వేశారు.
అయితే అదే రోజు విడుదల కావాల్సిన సినిమాలకు స్క్రీన్ల విషయంలో సమస్యలు ఏర్పడ్డాయి. అదే రోజున తమ సినిమాను విడుదల చేయాలని ముందుగానే నిర్ణయించుకున్న కొందరు నిర్మాతలు `సాహో` కోసం కాంప్రమైజై వారి సినిమాలను వాయిదా వేశారు. దీనిపై `సాహో` నిర్మాణ సంస్థ యు.వి.క్రియేషన్స్ అందరికీ థ్యాంక్స్ చెబుతూ ఒక లేఖను రిలీజ్ చేసింది.
మీకు `ఆల్ ది బెస్ట్.. మీపై ప్రేమ, గౌరవం ఎప్పుడూ ఉంటాయి` అంటూ ప్రభాస్ కూడా మెసేజ్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రూ.300 కోట్ల బడ్జెట్తో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, వెన్నెల కిశోర్, అరుణ్ విజయ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జిబ్రాన్ బాణీలు అందిస్తున్నారు.