డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ `ఇస్మార్ట్ శంకర్`తో హిట్ ట్రాక్ ఎక్కి మంచి జోష్ మీదు ఉన్నాడు. రామ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఊహించని బ్లాక్బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం పూరి నెక్ట్స్ ప్రాజెక్ట్లో భాగంగా విజయ్ దేవరకొండతో సినిమా చేయబోతున్నాడు. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ నిర్మాతలుగా ఈ సినిమా తెరకెక్కునుందని తెలుస్తోంది. అయితే పూరి అండ్ ఛార్మి విజయ్ కోసం కొత్త హీరోయిన్ ని వెతికే పనిలో ఉన్నాడు.
ఈ క్రమంలోనే వీరి ఫోకస్ మొత్తం జాహ్నవి కపూర్ మీద పడింది. టాలీవుడ్ లో శ్రీదేవి కూతురు ఎప్పటినుండో నటించాలనుకుంటుందని ఎన్నో కథనాలు వచ్చాయి. ఈమెను టాలీవుడ్ లోకి తీసుకురావాలని చాలామంది దర్శకనిర్మాతలు ట్రై చేస్తున్నారు. అయితే ఛార్మి ఇటీవల ముంబై వెళ్లి జాహ్నవి కపూర్ ని కలిసి కథ చెప్పిందట. అన్నీ సెట్ చేసుకున్న తర్వాత జాహ్నవి రెమ్యునరేషన్ విని ఛార్మి మైండ్ బ్లాక్ అయిందట.
జాహ్నవి కపూర్ ఏకంగా నాలుగు కోట్లు ఇస్తేనే మీ సినిమా చేస్తానని చెప్పడంలో నోట మాట రాక ఛార్మీ తిరిగి వచ్చేసిందని తెలుస్తోంది. వాస్తవానికి టాలీవుడ్లో టాప్ హీరోయిన్లు కూడా అంత హై బడ్జెన్ రెమ్యునరేషన్ తీసుకోవడం లేదు. కానీ జాహ్నవి ఏకంగా నాలుగు కోట్ల వరకు వెళ్లడం నిజంగా ఆశ్చర్యమే అని చెప్పాలి. జాహ్నవి కపూర్ భారీ రెమ్యునరేషన్ అడగడంతో షాక్ తిన్న పూరీ అండ్ ఛార్మీ ఏం చేస్తారో చూడాలి.
ఇక బాలీవుడ్లోనూ జాహ్నవి కపూర్పై ఇదే కంప్లెంట్ ఉంది. ఆమెకు క్రేజీ యంగ్ హీరోల సినిమాల్లో ఛాన్సులు ఇస్తుంటే భారీ రేట్లు డిమాండ్ చేయడంతోనే ఆమెకు కొందరు దర్శకనిర్మాతలు దూరంగా ఉంటున్నట్టు టాక్.