ప్రస్థుతం మణిరత్నం సుమారు 250 కోట్ల భారీ బడ్జెట్ తో తీయబోతున్న మూవీని
తమిళ ‘బాహుబలి’ గా వర్ణిస్తూ
కోలీవుడ్ మీడియా ఈ
సినిమా ఇంకా ప్రాంరంభం కాకుండానే ఈ
మూవీ పై అంచనాలు పెంచేస్తోంది. ఈ మూవీలో
తమిళ కన్నడ హిందీ రంగాలకు చెందిన ప్రముఖ నటీ నటులతో పాటు మన
టాలీవుడ్ కు సంబంధించి
మోహన్ బాబు ఈ మూవీలో ఒక కీలక పాత్రలో నటించబోతున్నాడు.
తమిళ భాషలో అత్యంత ప్రజాదరణ పొందిన చారిత్రాత్మక నవల పొన్నియన్ సెల్వన్ ఆధారంగా ఈ మూవీని తీయబోతున్నారు. చరిత్రలో చోళ సామ్రాజ్యానికి చెందిన రాజరాజ చోళ జీవితం చుట్టూ వ్రాయబడ్డ ఈ నవలను ఆధారంగా చేసుకుని మణిరత్నం ఈ భారీ బడ్జెట్ సినిమాకు శ్రీకారం చుడుతున్నాడు.
ఈ మూవీలో
విక్రమ్ జయం రవి ఐశ్వర్యరాయ్
అమితాబ్ లతో పాటు
కీర్తి సురేశ్ కూడ నటిస్తోంది. ఈ మూవీకి తెలుగులో కూడ మంచి
మార్కెట్ తీసుకు రావాలి అన్న ఉద్దేశ్యంతో ఈ మూవీలోని ఒక కీలక పాత్రలో నటించమని మణిరత్నం అనేక సార్లు
ప్రభాస్ చరణ్ మహేష్ ల చుట్టూ అనేక సార్లు
హైదరాబాద్ వచ్చి వారిలో ఎవరో ఒకరిని ఒప్పించడానికి మణిరత్నం ఎన్నో ప్రయత్నాలు చేసాడు.
అయితే మణిరత్నం పట్ల మన టాప్ హీరోలు అంతా ఎంతో గౌరవం ప్రదర్శిస్తూ తమ నిర్ణయాన్ని మాత్రం చెప్పకుండా మణిరత్నంకు చుక్కలు చూపించడంతో మన టాప్ తెలుగు
హీరో చేయవలసిన పాత్రను
కార్తి చేసే విధంగా ఫైనల్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కార్తీ లేటెస్ట్ గా నటించిన ‘ఖైదీ’ తెలుగులో సూపర్ హిట్ కావడంతో పాటు
కార్తి తెలుగులో డైలాగ్స్ చెప్పగలడు కాబట్టి మన టాప్ హీరోలకు
కార్తి చేత మణిరత్నం
చెక్ పెట్టిస్తున్నాడు అంటూ
కోలీవుడ్ మీడియా వార్తలు వ్రాస్తోంది..