ఒక సినిమాలో హీరోగా ఒకర్ని అనుకుని వాళ్ళకి డేట్స్ కుదరకపోవడం వల్లనో, మరే ఇతర కారణాల వల్లనో కొన్ని సార్లు వాళ్ళు ఆ సినిమాలో హీరోగా నటించలేరు. అదే అవకాశం వేరే హీరోను వరిస్తుంది.ఆ సినిమా హిట్ అయితే మాత్రం అయ్యో ఆ సినిమాను నేను చేసిఉంటే బాగుండే అని అనిపిస్తుంది కదా. అదే సినిమా కనుక ప్లాప్ అయితే హమ్మయ్య ఆ సినిమా జోలికి నేను పోలేదు అని అనుకునే హీరోలు కూడా ఉంటారు.అలా ఒక హీరో వద్దు అనుకుని మరొక హీరోకి విజయం తెచ్చిపెట్టిన సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఇలాంటి ప్రచారం ఒకటి తెగ వైరల్ అయింది. నందమూరి నట సింహం బాలయ్య బాబు వదులుకున్న సినిమాలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్నాడంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త హల్ చల్ చేస్తుంది. అసలు వివరాల్లోకి వెళితే..



తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.అయితే ఈ సినిమాను మొదటగా బాలీవుడ్ లో 'పింక్'అనే పేరుతో తీశారు. పింక్ చిత్రానికి రీమేక్ గా తెలుగులో వచ్చిన చిత్రమే 'వకీల్ సాబ్'. అయితే ఈ సినిమాలో మొదటగా హీరోగా  నందమూరి బాలకృష్ణ అనుకున్నారట.అయితే ఆయన రిజెక్ట్ చేశారని ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ లో వచ్చిన 'పింక్' చిత్రాన్ని అప్పటికే కోలీవుడ్ లో కూడా తీశారు. అందులో స్టార్ హీరో అజిత్ నటించాడు. తమిళ్ లో 'నెర్కొండ పార్వై' పేరుతో రీమేక్ చేసి సక్సెస్ అయ్యారు. అలా బాలీవుడ్, కొలీవుడ్ లో విజయం సాధించిన తరువాత దీనిని తెలుగులో తీయాలని భావించిన ప్రొడ్యూసర్ దిల్ రాజు  వకీల్ సాబ్ సినిమాలో  బాలకృష్ణ  నటిస్తే బాగుంటుందని అనుకున్నారట. కానీ బాలకృష్ణ ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేశారట. ఆ సమయంలోనే అప్పటికే రీ ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్న పవన్ కు దాన్ని చూపించడం జరిగిందట.సినిమా చుసిన వెంటనే పవన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందట.




అయితే మళ్ళీ ఇప్పుడు రీసెంట్ గా పవన్ నటిస్తున్న 'అయ్యప్పనుమ్ కోషియమ్' రీమేక్ లో కూడా మొదటగా  బాలకృష్ణ నటించనున్నారని వార్తలొచ్చాయి.ఈ సినిమాలో బిజు మీనన్ చేసిన ఎస్‌ఐ క్యారెక్టర్ బాలకృష్ణ చేస్తాడని, పృథ్వీరాజ్ రోల్ రానా దగ్గుబాటి చేస్తాడనీ అప్పట్లో గుసగుసలు వినిపించాయి. కానీ ఫైనల్ గా ఈ సినిమాలో పవన్, రానా చేస్తున్నారు. ఇలా బాలకృష్ణ వద్దు అనుకున్న రెండు సినిమాలు పవన్ కళ్యాణ్ చేస్తున్నాడంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: